Azadi Ka Amrit Mahotsav: మన ఆంగ్లం వద్దు.. అమ్మభాషే మేలు
బోధన మాతృభాషలోనా? ఆంగ్లంలోనా? మనమిప్పుడు తరచూ చర్చిస్తున్న ఈ సమస్య ఆంగ్లేయుల పాలనలోనూ ఎదురైంది. దీనిపై తెల్లవారి మధ్యే తీవ్ర వాదోపవాదాలు సాగాయి.
తగువులాడుకున్న తెల్లవారు
బోధన మాతృభాషలోనా? ఆంగ్లంలోనా? మనమిప్పుడు తరచూ చర్చిస్తున్న ఈ సమస్య ఆంగ్లేయుల పాలనలోనూ ఎదురైంది. దీనిపై తెల్లవారి మధ్యే తీవ్ర వాదోపవాదాలు సాగాయి. గమ్మత్తేమంటే... చాలామంది ఆంగ్లేయ ఉన్నతాధికారులు స్థానిక మాతృభాషల్లోనే బోధించాలని వాదించారు. కానీ మెకాలే, బెంటింక్లాంటివారు - మానసిక బానిసల్ని తయారు చేయాలంటే ఆంగ్లమే అసలైన మార్గమని వాదించి ఒప్పించారు.
ఈస్టిండియా కంపెనీ పాలన మొదలైన తర్వాత చాలామంది ఆంగ్లేయ అధికారులు స్థానిక భాషలపై మక్కువ పెంచుకున్నారు. 1770లో గవర్నర్ జనరల్గా వ్యవహరించిన వారెన్ హేస్టింగ్స్... సంస్కృతం, పర్షియన్, అరబిక్ భాషల్లో పట్టు సంపాదించారు. 1820 నుంచి 1833 దాకా కంపెనీ తరఫున విద్యా విషయాల్లో నిర్ణయాలు తీసుకున్న హోరేస్ హేమన్ విల్సన్... కాళిదాసు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలు, యూనివర్సిటీల్లో సంస్కృతం, పర్షియన్లకు ప్రాధాన్యం ఇస్తూ ఆంగ్లాన్ని ఓ సబ్జెక్ట్గా బోధించేవారు.
1823లో జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (జీసీపీఐ)ని ఏర్పాటు చేసి విద్యారంగం బాధ్యతలు అప్పగించారు. పదేళ్లపాటు ఈ కమిటీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. కోల్కతా మదర్సాలను, బనారస్ సంస్కృత కళాశాలను ఆధునికీకరించటం; కోల్కతా, ఆగ్రా, దిల్లీల్లో సంస్కృత కళాశాలల ఏర్పాటు, భారీస్థాయిలో సంస్కృత, అరబిక్ పుస్తకాల ముద్రణ; వివిధ సబ్జెక్టులకు చెందిన ఆంగ్ల పుస్తకాలను స్థానిక భాషల్లోకి అనువదించటం..... ఇలా జీసీపీఐ తీసుకున్న చర్యలు చాలామటుకు భారతీయ భాషల్ని గౌరవించినవే.
1833లో కంపెనీ ఛార్టర్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్తో పాటు మిగిలిన దేశాల మిషినరీలనూ భారత్లోకి అనుమతించారు. ప్రభుత్వంలో ఉన్నతపదవులకు ఆంగ్ల విద్య తప్పనిసరి చేశారు. విద్యారంగానికి నిధులను లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచారు. వీటన్నింటితో పాటు... గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొత్తగా ఓ సభ్యుడి (న్యాయ)ని చేర్చి... లార్డ్ మెకాలేను భారత్కు పంపించారు. 1834 జూన్ 10న మెకాలే భారత్లో అడుగుపెట్టడంతో భారత విద్యారంగం ముఖచిత్రం మారిపోయింది.
విద్యా కమిటీ (జీసీపీఐ)లో విభేదాలు మొదలయ్యాయి. స్థానికభాషలకు ప్రాధాన్యమిస్తూ, ఆంగ్లాన్ని నేర్పాలనే వారు (ఓరియెంటలిస్టులు); స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆంగ్లంలోనే బోధించాలని పట్టుబట్టేవారు (ఆంగ్లిసిస్ట్లు)గా కమిటీ విడిపోయింది. అప్పటి బెంగాల్ ప్రభుత్వానికి విద్యా కార్యదర్శిగా పనిచేసిన హెచ్టీ ప్రిన్సెప్ ఓరియెంటలిస్టులకు నాయకత్వం వహిస్తే... ఆంగ్లిసిస్ట్లు లార్డ్ మెకాలేను నమ్ముకున్నారు. భారతీయుడైన రాజా రామ్ మోహన్రాయ్లాంటి వారి నుంచీ మెకాలేకు మద్దతు లభించింది.
కమిటీలో ఇరువర్గాల బలం సమంగా ఉండటంతో... ఏ నిర్ణయానికీ రాలేక... గవర్నర్ జనరల్ కౌన్సిల్కు సమస్యను నివేదించారు. 1835 ఫిబ్రవరి 2న మెకాలే ఓ నివేదికను కౌన్సిల్ ముందుంచి ఆంగ్లవిద్య కోసం బలంగా వాదించారు.
గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ ఈ వాదనతో ఏకీభవించారు. దీంతో ఓరియెంటలిస్టులు ఓడిపోయారు. బెంటింక్ ఆమోదంతో 1835 మార్చి 7 నుంచి మెకాలే నివేదిక అమల్లోకి వచ్చేసింది. ఆయన కోరుకున్న వారసుల తయారీ మొదలైంది.
పుట్టుకే వారిది..
‘మన ఆంగ్ల భాష పాలకుల భాష. వాణిజ్య భాష. ఇది ప్రపంచ భాష. భారతీయ స్థానిక భాషలు అత్యంత హీనమైనవి. పాశ్చాత్య అభ్యసనానికి ఇవి సరిపోవు. సాహిత్యమంటే ఆంగ్ల సాహిత్యమే. హిందూ, ముస్లింల సాహిత్యం కాదు. యూరోపియన్ పుస్తకాలతో కూడిన ఒక చిన్న గూడు (షెల్ఫ్) మొత్తం భారతీయ, అరేబియా సాహిత్యం కంటే ఎంతో విలువైంది. పాశ్చాత్య సైన్స్ను నేర్చుకోవాలంటే ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిందే. ఇక్కడి చదువులన్నీ భారతీయులకు అనుగుణంగా ఉన్నాయి. వారి సాహిత్యాన్ని ముద్రిస్తే మనకేం వస్తుంది? వాటిని తక్షణమే మూసేయాలి. భారతీయులను మార్చాలంటే ఆంగ్లం తప్పనిసరి. పుట్టుక ఒక్కటే భారతీయం. ఆ తర్వాత వారి ఆలోచనలు, అభిప్రాయాలు, విలువలు, విజ్ఞానం అన్నీ ఆంగ్లమయం కావాలి. అందుకు ఆంగ్లమాధ్యమమే మార్గం.’
- మెకాలే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?