Coronavirus: పేగులపైనా కరోనా ప్రభావం
మనిషి శరీరంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలతోపాటు, జీర్ణకోశ వ్యవస్థలోనూ కరోనా వైరస్ పలు సమస్యలు
రక్త సరఫరా నిలిచిపోవడంతో సమస్యలు
గాంగ్రిన్ వస్తే.. అవయవం తొలగించాల్సిందే
అల్సర్లు ఉంటే యాంటీకొయాగ్యులెంట్లు వాడొద్దు
డాక్టర్ కొడాలి జగన్మోహన్రావు సూచనలు
మనిషి శరీరంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలతోపాటు, జీర్ణకోశ వ్యవస్థలోనూ కరోనా వైరస్ పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. వైరస్ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడటంతో రక్తసరఫరా నిలిచిపోయి... కొందరిలో పేగులూ దెబ్బతింటున్నాయి. పేగుకు రక్తప్రసరణ తగ్గడం (మిసెంటెరిక్ ఇస్కీమియా), పేగు కుళ్లిపోవడం (గాంగ్రిన్ ఆఫ్ ద బవెల్) వంటి సమస్యలు కొందరు కొవిడ్ రోగుల్లో కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొవిడ్ చికిత్సలో భాగంగా వాడే స్టెరాయిడ్ల వల్ల కొందరిలో అన్నవాహిక, పొట్ట, చిన్నపేగుల్లో పుండ్లు (అల్సర్లు) ఏర్పడి రక్తస్రావం జరుగుతోంది. కరోనా రోగుల్లో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? వీటిని ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేంటి? వంటి అంశాలపై ప్రముఖ జీర్ణకోశవ్యాధుల నిపుణులు డాక్టర్ కొడాలి జగన్మోహన్రావు విశ్లేషణ, సూచనలు ఇవీ..
మిసెంటెరిక్ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్లే..
కరోనా వైరస్ ప్రభావం, అది కలిగించే ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళాల లోపలి గోడలకు రక్షణగా ఉండే సున్నితమైన పొర ఎండోథీలియం దెబ్బతింటోంది. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందుల ద్వారా, శస్త్రచికిత్స ద్వారా రక్తపు గడ్డలు తొలగించొచ్చు. అలక్ష్యం చేస్తే సమస్య ముదిరి... కాలికి రక్తసరఫరా చేసే నాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడితే, గాంగ్రిన్కు దారితీస్తోంది. కొన్ని సందర్భాల్లో అంతవరకూ కాలు తొలగించాల్సి వస్తోంది. గుండెలోని కండరాలకు రక్తం సరఫరా చేసే సూక్ష్మనాళాల్లో గడ్డలు ఏర్పడితే గుండె పనితీరు దెబ్బతినడం, గుండెకు రక్తం వెళ్లే ప్రధాన రక్తనాళాల్లో రక్తపు గడ్డలు వస్తే గుండెపోటు సంభవిస్తున్నాయి. పేగులకు రక్త సరఫరా జరిగే ధమనుల్ని మిసెంటెరిక్ రక్తనాళాలు అంటారు. కరోనా ప్రభావంతో వీటిలో రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల చిన్న పేగులకు అవసరమైనంత రక్త సరఫరా జరగదు. దీన్ని మిసెంటెరిక్ ఆర్టెరీ థ్రాంబోసిస్ అంటారు.
కుళ్లిపోయిన పేగు భాగం తొలగించాలి
కరోనాతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల చిన్న పేగులకు పాక్షికంగా రక్తసరఫరా నిలిచిపోవడాన్ని మిసెంటెరిక్ ఇస్కీమియా అంటారు. రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోతే... అంత మేర పేగు కుళ్లిపోతుంది. దాన్ని ‘గ్యాంగ్రిన్ ఆఫ్ ద బవెల్’గా పిలుస్తారు. మిసెంటెరిక్ ఇస్కీమియాను కొంతవరకూ మందులతో నయం చేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి యాంజియోప్లాస్టీ, శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. గాంగ్రిన్ ఏర్పడి పేగు కుళ్లిపోతే... శస్త్రచికిత్స చేసి కుళ్లిపోయిన మేర పేగు భాగాన్ని తొలగించి, రెండు కొసల్ని కలిపి కుట్టేస్తారు. చిన్న పేగులు ఏడు మీటర్ల వరకు పొడవు ఉంటాయి. దానిలో కొంత తొలగించినా సమస్యేమీ ఉండకపోవచ్చు. సాధారణంగా పెద్ద పేగు కంటే, చిన్న పేగులోనే గాంగ్రిన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కరోనా వల్ల ఇతర అవయవాల్లో ఏర్పడుతున్న గాంగ్రిన్తో పోలిస్తే చిన్న పేగుల్లో మిసెంటెరిక్ ఇస్కీమియా, గాంగ్రిన్ ఏర్పడటం కొంత అరుదుగానే ఉంది. అలాగని ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. సమస్య లక్షణాలేంటో తెలుసుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం.
స్టెరాయిడ్లతో అల్సర్ల ప్రమాదం
ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొవిడ్ బాధితులకు స్టెరాయిడ్స్ వాడతారు. అలాగే రక్తం గడ్డకట్టకుండా... హెపారిన్ వంటి మందులూ వాడుతున్నారు. చిన్న పేగులకు రక్తం సరఫరా చేసే మిసెంటిరిక్ రక్తనాళాల్లో ఏర్పడే గడ్డల్ని యాంటీకొయాగ్యులెంట్ మందులతో కొంతవరకూ నివారించవచ్చు. కొవిడ్ రోగులకు వాడుతున్న స్టెరాయిడ్స్ వల్ల కొందరిలో అన్నవాహిక, పొట్ట, చిన్నపేగుల్లో పుండ్లు (అల్సర్లు) ఏర్పడి రక్తస్రావం జరిగే ప్రమాదముంది. ఇప్పటికే అల్సర్లు ఉంటే యాంటీకొయాగ్యులెంట్ మందుల వల్ల రక్తస్రావం పెరిగే అవకాశమూ ఉంది. అందుకే అల్సర్లను నివారించడానికి ఒమెప్రజోల్, ఫామొటిడిన్ వంటి యాంటీ అల్సర్ మందులు వాడాల్సి ఉంటుంది. యాంటీకొయాగ్యులెంట్ మందుల్ని కొంత కాలం నిలిపేయాల్సి రావచ్చు.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాలి
మిసెంటిరిక్ ఇస్కీమియా, గాంగ్రిన్ వంటి సమస్యలు కొవిడ్ చికిత్స పొందుతున్నప్పుడు, వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా ఏర్పడే అవకాశముంది.
* పొట్టనొప్పి ఉన్నా, వాంతులు, విరేచనాలు నల్లగా అవుతున్నా, రక్తపు విరేచనాలు అవుతున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
* కొవిడ్ రోగులకు చికిత్స అందించేటప్పుడు వివిధ రంగాల నిపుణులు అందుబాటులో ఉండకపోవచ్చు. కొవిడ్ రోగులు, వారికి చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. రోగికి పొట్టనొప్పి వంటి సమస్యలుంటే... పేగులకు రక్తసరఫరా జరిగే నాళాల్లో ఏమైనా సమస్య ఏర్పడిందేమోనని అనుమానించాలి. వాంతులు, విరేచనాలు నల్లగా అయినా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినా, జీర్ణకోశంలో రక్తస్రావాన్ని అనుమానించాలి.
* కొవిడ్ రోగులకు రక్తంలో డి-డైమర్, ఐఎల్-6, సీఆర్పీ వంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని బట్టి ఈ సమస్యలు ఎవరిలో రావొచ్చో ముందుగా పసిగట్టి డాక్టర్లు నివారణ చర్యలు తీసుకుంటారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాతా డాక్టర్లు సూచించినంత కాలం కొన్నాళ్లు యాంటీకాగ్యులెంట్ మందులు వాడాలి.
* ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జయిన తర్వాత కూడా రోగులు అప్రమత్తంగా ఉండటం అవసరం.
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు