Pattabhiram: పట్టాభికి 2 వరకు రిమాండు
తెదేపా నేత పట్టాభిరామ్కు మేజిస్ట్రేట్ వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండు విధించారు. సీఎం జగన్ను పరుష పదజాలంతో దూషించి, గొడవలకు కారకుడయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్ మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు
మచిలీపట్నం జిల్లా కారాగారానికి తరలింపు
కొవిడ్ ఫలితం అనంతరం రాజమహేంద్రవరం జైలుకు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, నేరవార్తలు, న్యాయవిభాగం: తెదేపా నేత పట్టాభిరామ్కు మేజిస్ట్రేట్ వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండు విధించారు. సీఎం జగన్ను పరుష పదజాలంతో దూషించి, గొడవలకు కారకుడయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్ మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదుచేసి పట్టాభిని అరెస్టుచేశారు. గురువారం ఉదయం విజయవాడ కొత్త ఆసుపత్రికి తీసుకొచ్చి, కొవిడ్ సహా పలు పరీక్షలు చేయించారు. అనంతరం మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. పట్టాభిపై ఐదు కేసులున్నాయని, ముఖ్యమంత్రిని దూషించారని, ఆయన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, అందువల్ల రిమాండ్ విధించాలని కోరారు. పట్టాభి తరఫు న్యాయవాదులు గూడపాటి లక్ష్మీనారాయణ, చేకూరి శ్రీపతిరావు వాదనలు వినిపిస్తూ.. 41 (ఏ) సీఆర్పీసీ ప్రకారం స్టేషన్ బెయిలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్ శ్రీసత్యాదేవి... నిందితుడికి వచ్చేనెల 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కోసం నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం కొవిడ్ ఫలితం వచ్చేవరకూ మచిలీపట్నంలోని జిల్లాజైలులో ఉంచాలి. దీంతో గురువారం రాత్రి అక్కడికి తరలించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పట్టాభి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఖాళీలతో 41 (ఏ) సీఆర్పీసీ నోటీసు
కోర్టులో వాదనల సందర్భంగా పట్టాభి పలు అంశాలను ప్రస్తావించారు. పోలీసులు తనపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వలేదని చెప్పారు. మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేసినట్లు చెబుతున్న నేర అంగీకార పత్రంలో లోపాలను ఎత్తిచూపారు. తాను నేరాన్ని అంగీకరించలేదని, సంతకాలే తీసుకున్నారని చెప్పారు. 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులో ఖాళీలు ఎందుకు ఉన్నాయని, దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని గవర్నర్పేట సీఐని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు
ఈ నెల 19న తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి, ఇతర అధికారులపై పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించారు. ఇది వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమైంది. వివిధవర్గాల మధ్య వైషమ్యాలకు దారితీసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. అతడు వాడిన రెచ్చగొట్టే భాష కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారి పట్ల ఇటువంటి ధోరణి సరికాదు. ఆయనను అరెస్టు చేయకుండా వదిలేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. ముఖ్యమంత్రిని దూషిస్తూ.. జన్మనిచ్చిన ఆయన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టాభిపై కేసు నమోదు అయింది.
* ఈ కేసు విచారణ నిమిత్తం పట్టాభి ఇంటికి వెళ్లగా.. విచారణకు సహకరించకుండా ఇంట్లో ఉండి తలుపులు వేసుకున్నారు. నాలుగున్నర గంటల పాటు వేచి చూసినా బయటకు రాలేదు. దీంతో ఇంటి తలుపులు తెరిచి లోపలకు వెళ్లి అదుపులోకి తీసుకున్నాం. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో నగరానికి దూరంగా ఉన్న తోట్లవల్లూరు స్టేషనుకు తరలించి, స్టేట్మెంట్ రికార్డు చేశాం. ఇప్పటికే పట్టాభిపై నగర కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయి. ఒకటో పట్టణ పీఎస్లో క్రైం నెం.. 6/21, గవర్నర్పేట స్టేషనులో క్రైం నెం. 86/19, 87/19, సూర్యారావుపేట స్టేషనులో క్రైం నెం. 224/20, కృష్ణలంక స్టేషనులో క్రైం నెం. 32/21 కింద నమోదై, వివిధ దశలలో ఉన్నాయి.
* పట్టాభితో పాటు మరికొందరు ఉన్నట్లు అనుమానం ఉంది. వీరి గురించి వివరాలు తెలుసుకునేందుకు విచారించాలి. నిందితుడి వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో పలు అవాంఛనీయ ఘటనలు సంభవించాయి. ఓ పోలీసు అధికారిపై హత్యాయత్నం జరిగింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషనులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేయాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?