Chandrababu: మద్యం డబ్బులతో.. సంక్షేమ పథకాలా?
ఇందుకూరుపేట, న్యూస్టుడే: ‘మద్యం తాగిన డబ్బుతో వచ్చే ఆదాయంతో.. సంక్షేమ పథకాలు అమలు చేయడమేంటి? నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి రావడమేంటి? పింఛన్లు ఇవ్వడమేంటి? ప్రజలను కష్టపెట్టేందుకు జగన్..
ఇసుక మాఫియా కోసం ప్రజల ప్రాణాలు పణం
నెల్లూరులో బాధితులకు చంద్రబాబు పరామర్శ
చంద్రబాబునాయుడికి తన ఇంట్లో పరిస్థితిని వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామ మహిళ
ఈనాడు, తిరుపతి, ఈనాడు డిజిటల్, నెల్లూరు: ఇందుకూరుపేట, న్యూస్టుడే: ‘మద్యం తాగిన డబ్బుతో వచ్చే ఆదాయంతో.. సంక్షేమ పథకాలు అమలు చేయడమేంటి? నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి రావడమేంటి? పింఛన్లు ఇవ్వడమేంటి? ప్రజలను కష్టపెట్టేందుకు జగన్.. ఇలాంటి కొత్త స్కీములు మరెన్నో తెస్తాడు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రాపూరు, గంగపట్నం గ్రామాల్లో, నెల్లూరు నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. గంగపట్నంలో కొట్టుకుపోయిన చెరువు కట్టలను, దెబ్బతిన్న ఇళ్లు, ఆక్వా చెరువులను పరిశీలించారు. బాధితుల ఇళ్లలోకి వెళ్లి పలకరించారు. ఇళ్లన్నీ బురదమయమయ్యాయని మహిళలు విలపించగా.. నేనున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాగా మారి ఇసుక దోచుకుంటున్నారని, చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల కోసమే సోమశిల నుంచి దిగువకు నీళ్లు వదలకుండా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపించారు.
ఇళ్లు బాగుచేయడం ఎంతసేపు?
‘ప్రభుత్వం తలచుకుంటే.. దెబ్బతిన్న 150 ఇళ్లకు మరమ్మతులు ఎంతసేపు? మొద్దు నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తిట్టాలంటే సభ్యత అడ్డొస్తోంది. కష్టాలు తీర్చలేని ఈ ప్రభుత్వం మనకెందుకు? రూ.2 వేల పరిహారంలోనూ తెదేపా అనుకూలురకు ఇవ్వడం లేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. గంగపట్నంలో నష్టపోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.5వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. 10 గంటల పాటు స్తంభంపై ఉన్న ఇద్దరి ప్రాణాలు కాపాడిన మత్స్యకారుడు సురేష్కు ట్రస్టు తరఫున ప్రోత్సహిస్తామన్నారు. వరదల్లో చనిపోయిన పాలిటెక్నిక్ విద్యార్థి దుగ్గి గోపి తల్లి నాగమణితో మాట్లాడిన బాబు.. రూ.లక్ష సాయం ప్రకటించారు.
నెల్లూరు జిల్లా గంగపట్నంలో గిరిజన కుటుంబాన్ని పరామర్శించి, పూరింట్లో నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు
రూ.1కే ఇళ్ల రిజిస్ట్రేషన్
‘1983 నుంచి పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు, స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడమేంటి? రిజిస్ట్రేషన్ కోసం ఎవరూ డబ్బు కట్టొద్దు. దీనిపై న్యాయపోరాటం చేద్దాం. తెదేపా అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే దీన్ని రద్దుచేసి, రూ.1కే రిజిస్ట్రేషన్ చేసిస్తామ’ని బాబు హామీ ఇచ్చారు.
పరిహారం అందించే వరకు పోరాడుతాం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 తుపాన్లు వచ్చాయి. ఇప్పటికీ నష్టపరిహారంపై విధివిధానాలు రూపొందించలేదని చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తాజా వరదలకు చనిపోయిన వ్యక్తికి రూ.25 లక్షలు, ఉపాధి కోల్పోయిన వారికి రూ.20 వేలు, స్వల్పంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.25 వేలు ఇవ్వాలి. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు రూ.20 వేల పరిహారం, కోళ్ల పరిశ్రమలోని ఒక్కో కోడికి రూ.250, బ్రాయిలర్ కోడికి రూ.100, పౌల్ట్రీ షెడ్లు పూర్తిగా పోతే నిర్మించి ఇవ్వాల’ని డిమాండ్ చేశారు. ఈ విపత్తుపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. ‘రాష్ట్రం తన వద్దనున్న విపత్తు నిధి నుంచి ముందు ఖర్చుపెట్టి.. తర్వాత కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనావేసిన ప్రభుత్వం.. వంద కోట్లయినా విడుదల చేయలేదు. కేంద్రాన్ని రూ.వెయ్యి కోట్లు ఇవ్వమంటే ఎందుకిస్తారు? ఇదే అనుభవం లేకపోవడమంటే’ అని సీఎం జగన్ను విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల ఆర్తనాదాలు వినకుండా, అసెంబ్లీలో తన చుట్టూ చేరే వారి భజనలకు ఆనందిస్తున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్