17న తిరుపతిలో బహిరంగ సభ
‘రాళ్లు పడతాయని బెదిరించిన వారు... పూలవర్షం కురిపిస్తున్న ప్రజా స్పందనను చూడాలి. పెయిడ్ ఆర్టిస్టులని ఎగతాళి చేసిన వారు... రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును తిలకించాలి.
అమరావతి ఆకాంక్షను తెలిపేలా నిర్వహిస్తామన్న ఐకాస
30వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగిన మహాపాదయాత్ర
ఈనాడు డిజిటల్, నెల్లూరు: నెల్లూరు గ్రామీణం, పొదలకూరు, న్యూస్టుడే: ‘రాళ్లు పడతాయని బెదిరించిన వారు... పూలవర్షం కురిపిస్తున్న ప్రజా స్పందనను చూడాలి. పెయిడ్ ఆర్టిస్టులని ఎగతాళి చేసిన వారు... రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును తిలకించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన డిసెంబరు 15కు తిరుపతి చేరుకుని, 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తాం. అమరావతి ఆకాంక్షను రాష్ట్రవ్యాప్తంగా చాటుతాం’ అని అమరావతి ఐక్య కార్యాచరణ వేదిక సభ్యులు స్పష్టంచేశారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 30వ రోజు నెల్లూరులో సాగింది. భారీ వర్షాలతో రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
అడ్డంకులు... ఆంక్షలు
ఈ సందర్భంగా అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ... ‘మహా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసు ఆంక్షల పేరిట వేధిస్తున్నారు. రాత్రిపూట బస చేసేందుకు స్థలాలనూ దొరక్కుండా చేస్తున్నారు. పొదలకూరు మండలం మరుపూరు అమ్మవారి ఆలయంలో బసకు ఏర్పాట్లు చేసినప్పటికీ... స్థానిక నాయకుల ఒత్తిడితో ఆలయ నిర్వాహకులు అంగీకరించలేదు. దాంతో పాలిచర్లపాడు వద్ద ఖాళీ స్థలంలో టెంట్లు వేసుకున్నాం. అక్కడ మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు’ అని తెలిపారు. మరోవైపు పాదయాత్రలో భాగంగా వస్తున్న క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను మంగళవారం పోలీసులు నిలిపేశారు. హైకోర్టు అనుమతిచ్చిన వాహనాలు మాత్రమే యాత్రలో సాగాలని స్పష్టంచేశారు. దాంతో పాదయాత్రికులతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పట్టు వీడకపోవడంతో రథాలు లేకుండానే యాత్ర ముందుకుసాగింది.
అక్రమ కేసులపై బీసీ కమిషన్ స్పందన
తమను పాదయాత్రలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారంటూ నాయీబ్రహ్మణ సంఘం చేసిన ఫిర్యాదుపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. కావలిలో దేవుడి ప్రచార రథాల ముందు సన్నాయి మేళం వాయిస్తుంటే డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తమను అడ్డుకుని, కులవృత్తిని అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని కోరారు. స్పందించిన బీసీ కమిషన్... 15 రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని నెల్లూరు ఎస్పీ విజయరావుకు లేఖ రాసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మహారాష్ట్రలో ఎన్నికల బందోబస్తులో ఉన్న ఏపీఎస్పీకిచెందిన 10కంపెనీల సిబ్బంది పోస్టల్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 10న అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
పెద్దల మాట
-
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్