పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి కన్నుమూత
పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి (88) ఆదివారం రాత్రి గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశారు. 1934లో ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జన్మించిన శాంతిదేవి ఇంటర్మీడియట్
అనాథలకు తల్లిగా, సమాజ సేవకురాలిగా గుర్తింపు
ప్రధాని మోదీ సంతాపం
గుణుపురం, న్యూస్టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి (88) ఆదివారం రాత్రి గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశారు. 1934లో ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జన్మించిన శాంతిదేవి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 1951లో రతన్దాస్ను వివాహం చేసుకున్నారు. ఆ ఏడాదే అవిభక్త కొరాపుట్ జిల్లాలో తీవ్రమైన కరవు రావడంతో బాధితులకు అండగా నిలవాలని భర్తతో అక్కడికి చేరుకుని సేవలందించారు. ఈ సమయంలోనే వినోబాభావే భూదాన్ ఉద్యమంలో భాగమయ్యారు. పెత్తందార్ల చేతిలో ఉన్న భూములను పేదలకు పంచడం, కుష్ఠు రోగులకు సేవ చేయడం, గిరిజన బాలికలకు చదువు చెప్పడం, అనాథ బాలికలను చేరదీసి వసతి కల్పించి ప్రయోజకులను చేయడం చేసేవారు. రాయగడ జిల్లాలోని గుణుపురంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న శాంతిదేవి.. భర్త మరణించినా సేవలు కొనసాగించారు. సేవాసమాజ్ పేరిట ఆశ్రమాలు నెలకొల్పి వందలాది అనాథ బాలికలు, మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దారు. సోమవారం ఆమె పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జీవిత కాలంలో ఎన్నో పురస్కారాలు పొందిన శాంతిదేవి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 నవంబరులో పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. నిస్వార్థమైన సమాజ సేవ చేసిన మీ మరణ వార్త విని దుఃఖిస్తున్నానని ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
నూతన నేర న్యాయ చట్టాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్