చారిత్రక తప్పులను సరిదిద్దుతున్నాం
స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఎంతో మంది త్యాగాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి
నేతాజీ నివాస సందర్శన అనుభూతిని మాటల్లో చెప్పలేను
సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణలో మోదీ
ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాద్ హింద్ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఇండియాగేట్ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం దాని హాలోగ్రామ్ విగ్రహాన్ని డిజిటల్ రూపంలో ఆవిష్కరించి, ప్రసంగించారు.
‘‘2047కి ముందే సరికొత్త భారతదేశాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యం మన ముందిప్పుడు ఉంది. ఈ లక్ష్యాన్ని చేరకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. మన విజయాలే మన సంకల్ప శక్తికి సాక్ష్యాలు. మన యాత్ర సుదీర్ఘమైంది. ఎన్నో శిఖరాలు అధిరోహించాల్సి ఉంది. భారత్కున్న గుర్తింపును, ప్రేరణలను పునరుజ్జీవింపజేయాలి. స్వాతంత్య్రం తర్వాత దేశ సంస్కృతితోపాటు, ఎంతోమంది మహానుభావులు చేసిన యోగదానాలను తుడిచేసే పని జరిగింది. దశాబ్దాల తర్వాత దేశం ఆ తప్పులను సరిదిద్దుతోంది. అంబేడ్కర్తో ముడిపడిన పంచతీర్థ్కున్న ప్రాధాన్యం ఆధారంగా ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐక్యతా విగ్రహ రూపంలో ప్రపంచ మొత్తం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కీర్తిని చూస్తోంది.
ఆయన ప్రతి అంకాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది
సుభాష్ చంద్రబోస్తో ముడిపడిన ప్రతి అంకాన్ని దేశం పూర్తి గౌరవంతో గుర్తు చేసుకుంటోంది. నేతాజీ ద్వారా అండమాన్లో త్రివర్ణ పతాకం ఎగిరిన 75వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి ఒక ద్వీపానికి ఆయన పేరు పెట్టాం. కోల్కతాలో నేతాజీ పుట్టిన ఇంటికి వెళ్లే భాగ్యం గత ఏడాది నాకు దక్కింది. ఆయన చదువుకున్న గది, ఆ ఇంటి గోడలు, మెట్లను దర్శించుకున్న అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. ఎర్రకోటలోనూ ఆజాద్ హింద్ ఫౌజ్కు సంబంధించిన స్మారకం ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేతాజీ జీవితంతో ముడిపడిన దస్త్రాలను బహిర్గతం చేసే అవకాశం మా ప్రభుత్వానికి లభించింది. బోస్ ఏదైనా సంకల్పిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయేవారు. అందుకే మనం నేతాజీ నుంచి కెన్ డు, విల్ డూ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలి. నేతాజీ కలలుగన్న భారత్ను తీర్చిదిద్దడంలో మనం సఫలమవుతామన్న నమ్మకం నాకుంది’’ అని మోదీ పేర్కొన్నారు. సందర్శకులకు కనిపించని రీతిలో ఇండియాగేట్ వద్ద డిజిటల్ తెర ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు డిజిటల్ దీపాల వెలుగులో దీనిపై కనిపించే విగ్రహం ఎత్తు 28 అడుగులు. వెడల్పు ఆరు అడుగులు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి నివాళులు
నేతాజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ‘పరాక్రమ్ దివస్’ శుభాకాంక్షలు తెలిపారు. నేతాజీ ఆదర్శాలు, త్యాగాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతాయని కోవింద్ చెప్పారు. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఫొటోను మోదీ ట్విటర్లో పంచుకున్నారు. ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య ఉద్యమంపై సరికొత్త ఉత్సాహాన్ని నింపిన మహోన్నత జాతీయవాది సుభాష్ చంద్రబోస్ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్వరాజ్య సంగ్రామంలో ఉన్నత పాత్రను పోషించిన వారికి దేశం రుణపడి ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు