Chandrababu: రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దు
అన్నదాతల మంచి కోసమే వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెడుతున్నామని పుంగనూరు పుడింగి చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీటర్లు
మోటార్లకు మీటర్లు మంచిదే అయితే నీ పొలంలో పెట్టుకో
మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు హితవు
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజూ పర్యటన
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, గుడుపల్లె: అన్నదాతల మంచి కోసమే వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెడుతున్నామని పుంగనూరు పుడింగి చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీటర్లు మంచివే అయితే నీ పొలానికి పెట్టుకో.. మా పొలానికి పెట్టొద్దని స్పష్టం చేశారు. రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు గురువారం రెండోరోజు పర్యటించారు. వర్షంలోనూ కుప్పం, గుడుపల్లె మండలాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం, రోడ్షో నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘వ్యవసాయానికి మీటర్లు పెడితే ప్రమాదమని భావించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని తొలగించారు. ఇప్పుడు మీటర్లు పెడితే రైతులకు లాభమని వైకాపా నాయకులు అంటున్నారు. నేను అన్నదాతలను రెచ్చగొడుతున్నానని మాట్లాడుతున్నారు. కేసులకు భయపడి, అప్పుల కోసమే రాష్ట్రంలో మీటర్లు పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు.
రోజుకో అత్యాచారం
‘రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతోంది. సీఎం జగన్ ఇలాకా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై 6 నెలలుగా 10 మంది అత్యాచారం చేస్తే.. గర్భం దాల్చింది. పోలీసులకు చెబితే కేసు నమోదు చేయడానికి వెనుకాడారు. ఇదేంటని అడిగితే.. కొన్ని అలా జరుగుతుంటాయ్. మద్యం మత్తులో అలా చేస్తుంటారు.. తల్లుల పెంపకం సరిగా లేకపోవడమే కారణమని ఓ మహిళా మంత్రి అంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్, మద్యం వినియోగం పెరిగి కొందరు మృగాల్లా తయారై అత్యాచారాలు చేస్తున్నారు. మహిళలపై దారుణాలు ఆపలేని ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
బాబు రావాలి.. బాధలు తీరాలన్న విద్యార్థిని
మార్గంమధ్యలో ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద మాట్లాడాలని విద్యార్థులు కోరడంతో షెడ్యూల్లో లేకపోయినా చంద్రబాబు ప్రసంగించారు. ఉపకార వేతనాలు రావడం లేదని, వర్సిటీలో ప్రాంగణ నియామకాలు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థిని ‘బాబు రావాలి.. బాధలు తీరాలి. మీరు సీఎంగా లేకపోవడంతో ఎన్నో తరాలు వెనుకబడ్డాయి’ అనడంతో అక్కడున్న వారు ‘సీఎం సీబీఎన్’ అని నినదించారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో కుల రాజకీయాలు చేస్తున్నారని, రిజిస్ట్రార్ వేణుగోపాలరెడ్డి వర్సిటీని సొంత ఆస్తిలా చూస్తున్నారని సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగిగా నేను మాట్లాడకూడదనే నిబంధనలున్నా.. ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. రిజిస్ట్రార్ 20 మందికి రూ.50 లక్షలు ఇచ్చి వర్సిటీలో క్వారీలు నడుపుతున్నారని పూర్వ విద్యార్థి చెప్పారు. పర్యటనలో నాయకులు గౌనివారి శ్రీనివాసులు, పీఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
సీబీఐనే బెదిరించారు..
‘వివేకా హత్య కేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టి, బాంబులేస్తామని బెదిరించిన వారికి జనాల ప్రాణాలు ఓ లెక్కా? చిత్తూరు జిల్లాలో హంద్రీ-నీవా పనులు 12 శాతం పూర్తి చేస్తే.. కుప్పానికి నీళ్లు అందుతాయి. అదీ చేయని వీరు 3 రాజధానులు కడతారా?’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్