CM Jagan: సాగు రంగానికి ప్రాధాన్యం
విభజిత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో సాగు రంగానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తెలిపారు. దిల్లీలో
నాడు-నేడుతో పాఠశాలల్లో మౌలిక వసతులు
ఇంటి వద్దకే పౌర సేవలు
ముఖ్యమంత్రి జగన్ వెల్లడి
ఈనాడు, దిల్లీ: విభజిత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో సాగు రంగానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తెలిపారు. దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 62% సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35% పైమాటేనని వివరించారు. ‘‘సాగు సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులకు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9గంటలు ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాకు 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. పంటల కొనుగోలు ప్రక్రియను సీఎం యాప్తో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలును సమర్ధంగా అమలు చేసేందుకు ఈ-క్రాప్ బుకింగ్ దోహదపడుతోంది. రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాం. సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం. బడి మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతో పాటు జీఈఆర్ నిష్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్ నిష్పత్తి 99.21 శాతం కాగా ఏపీలో అది 84.48 కావడం విచారకరం. 2018 కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం విద్యారంగంలో రాష్ట్ర పనితీరు దారుణంగా ఉన్నందున విద్యారంగంలో కీలకాంశాలపై దృష్టి పెడుతూ సమర్థ విధానాలను తీసుకొచ్చాం. పిల్లలను బడికి పంపిస్తే ఏటా రూ.15 వేల చొప్పున తల్లులకు అమ్మఒడి కింద అందిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలోనూ సమూల మార్పులు తెచ్చాం. నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్ యాప్ ద్వారా బోధన అందిస్తున్నాం, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇవ్వనున్నాం. మన బడి నాడు-నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో వసతులు కల్పిస్తున్నాం. అన్ని స్కూళ్లను మ్యాపింగ్ చేసి, మూడో తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యాదీవెన కింద గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. 2018-19లో క్యాంపస్ ఎంపికల్లో 37వేల మందికి ఉద్యోగాలు వస్తే, 2020-21లో 69 వేల ఉద్యోగాలు వచ్చాయి. పౌరుల ఇళ్ల వద్దే సేవలు అందించేందుకు 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. ప్రతి 50-100 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించాం. అర్హులకు పథకాలు అందేందుకు అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాం’’ అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆయా అంశాలకు సంబంధించి ఒక నివేదికను సమర్పించారు.
రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన సీఎం జగన్.. ఆదివారం రాత్రి 7 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ జాషువా, సీపీ క్రాంతిరాణా టాటా నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?