బస్సులు వేసి.. స్థానికేతరులను పోగేసి
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం రావడంతో వైకాపా శ్రేణులు తమ బలాన్ని చాటుకునేందుకు నాలుగు
చిత్తూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనధికారిక సెలవులు
దుకాణాలు మూయించిన వాలంటీర్లు, సిబ్బంది
తిండి, నీరు లేక ఎండలో అల్లాడిన లబ్ధిదారులు
ప్రసంగం మధ్యలోనే వెనుదిరిగిన ప్రజలు
సీఎం పర్యటన సందర్భంగా కుప్పంలో ఇదీ పరిస్థితి
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, కుప్పం గ్రామీణ, పట్టణం: ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం రావడంతో వైకాపా శ్రేణులు తమ బలాన్ని చాటుకునేందుకు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాయి. కుప్పం కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని ఆ పార్టీ నాయకులు ఘనంగా ప్రకటించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రంగప్రవేశం చేసి నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత అందుకునే మహిళలందరినీ కుప్పం పట్టణంలోని అనిమిగానిపల్లె వద్దకు రావాలని ఆదేశించారు. లేకుంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయని హెచ్చరించారు. ఆర్టీసీ, పాఠశాల, కళాశాల, ప్రైవేటు బస్సులు భారీగా ఏర్పాటుచేశారు. తిరుపతి, మదనపల్లె, పీలేరు, పుత్తూరు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం డిపోల్లోని సుమారు 400 ఆర్టీసీ బస్సులు, పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన మరో 600 వరకు బస్సులు, వాహనాల్లో జనసమీకరణ చేశారు. ఆర్టీసీ బస్సులకూ వైకాపా జెండాలు కట్టి మరీ తరలించారు. బైరెడ్డిపల్లె మండలం కంభంపల్లి పంచాయతీ దాసార్లపల్లిలో జగన్ సభకు రాకుంటే రూ.500 జరిమానా విధిస్తామని గురువారం రాత్రి దండోరా వేయడంతో రెండు బస్సుల్లో లబ్ధిదారులు వచ్చారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల్లో జనాలను తరలించడంతో ఆయా జిల్లాల్లోని పలు విద్యాసంస్థలకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని బస్సులను జగన్ పర్యటనకు తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికుల రాకపోకలు ఇబ్బందిపడ్డారు.
దుకాణాల వద్ద వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తిష్ఠ
సీఎం జగన్ కాన్వాయ్ కుప్పం చెరువు కట్ట మీదుగా అనిమిగానిపల్లెకు వస్తున్నందున శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పట్టణంలోని చాలా దుకాణాలు మూసేశారు. అక్కడ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్, పంచాయతీరాజ్ సిబ్బంది మకాం వేశారు. బస్సుల్లో వచ్చిన మహిళలు, విద్యార్థులను రోడ్డు పొడవునా ఉంచారు. సీఎం వారికి అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. ముఖ్యమంత్రి రాకకు 3 గంటల ముందే హెలిప్యాడ్ నుంచి గంగమ్మ గుడి వరకూ ఉన్న మార్గంలో వాహనాలను అనుమతించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోనూ ఇదే తరహా ఆంక్షలు విధించారు. కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత పలమనేరు- కృష్ణగిరి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు శుక్రవారం ఉదయం నుంచే తెదేపా కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు. ముఖ్యమైన నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు.
పొరుగు జిల్లాల నుంచి తీసుకొచ్చి...
కుప్పం నియోజకవర్గం నుంచి మహిళలు ఆశించినంత స్థాయిలో రాలేదు. దీన్ని ఊహించిన వైకాపా శ్రేణులు, అధికార యంత్రాంగం ముందుగానే చిత్తూరు జిల్లా పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని మహిళలూ కార్యక్రమానికి రావాలని చెప్పారు. దీంతో సీఎం నిర్వహించిన కార్యక్రమంలో స్థానికేతరులే అధికంగా కనిపించారు. వచ్చినవారికి ఆహారం, నీళ్లు దొరక్క ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వెళ్లిపోవాలని భావించినా పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. జగన్ గంట ఆలస్యంగా రావడంతో పలువురు సభాస్థలికి రాకుండా సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో, చెట్ల కింద, బస్సుల్లో సేదతీరారు.
ఆహారం లభించక ఇక్కట్లు
జగన్ సభకు తీసుకొచ్చిన ప్రజలకు భోజన ప్యాకెట్లు ఇచ్చేందుకు నియోజకవర్గాల వారీగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. మొదట చిత్తూరు, పూతలపట్టు మినహా మిగిలిన కౌంటర్లలో భోజనాలు అయిపోవడంతో ఆగ్రహించిన జనం ఆ రెండుచోట్ల ఉన్న భోజనాలను ఆకలితో ఉన్నవారికి ఇవ్వాలని కోరారు. అక్కడున్న సిబ్బంది నిరాకరించడంతో వారిని పక్కకు తోసేసి ప్యాకెట్లు తీసుకెళ్లారు. జేసీ వెంకటేశ్వర్ అక్కడకు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఓ వాహనంలో భోజన ప్యాకెట్లు రాగా అక్కడున్నవారు ఒక్కసారిగా అటువైపు దూసుకెళ్లారు. ఎంత ప్రయత్నం చేసినా కొందరికి ఆహారం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. కొందరికి ఇచ్చిన ప్యాకెట్లలోని భోజనం పాడైపోవడంతో అక్కడే పారేశారు.
పొద్దున్నుంచీ తిండీ, నీళ్లు లేవు
పొద్దుటనుంచి భోజనాలు రాక ఎండకు ఎండుతున్నాం. 200 మంది నీళ్లు లేక అరుస్తా ఉన్నారు. రెండు మండలాలకు ఇదే పరిస్థితి అంటే ఎలా? రమ్మని జెండాలు మోయించి భోజనాలు పెట్టకపోవడమేంటి?
-రామచంద్ర, ఎంపీటీసీ సభ్యుడు, నూలుకుంట
దివ్యాంగురాలిని పట్టించుకోని వైనం
సీఎం సభ ముగించుకుని తిరిగి హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్నప్పుడు సభావేదిక బయట భర్తతో కలిసి కుప్పం అర్బన్ కాలనీకి చెందిన ఓ దివ్యాంగురాలు చంటిబిడ్డను తీసుకొచ్చి తన సమస్యను ముఖ్యమంత్రికి చెప్పాలని ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు ఆమెను బారికేడ్ల బయటకు తోసేశారు. పోలీసులను ఎంత బతిమిలాడినా సీఎంను కలిసేందుకు అంగీకరించకపోవడంతో ఆమె అక్కడే బైఠాయించి కన్నీటి పర్యంతమయ్యారు.
బస్సులు రాక.. రోగి పడిగాపులు
సీఎం పర్యటన సందర్భంగా శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్సులను కుప్పానికి తరలించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తగనన్ని బస్సులు లేక వెళ్లిన బస్సే తిరిగి వచ్చేవరకూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా పళ్లిపట్టు అన్నూరుకు చెందిన యాకోబు శుక్రవారం పల్లెవెలుగు బస్సు కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. వేకువజామున 4 గంటలకు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి వెళ్లి, 11 గంటలకు డయాలసిస్ చేయించుకుని భార్యతో కలిసి ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. పళ్లిపట్టు వెళ్లే బస్సులు లేక మధ్యాహ్నం 2గంటల వరకూ బస్టాండులో వేచి ఉన్నారు.
- ఈనాడు, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?