ఉచిత విద్యుత్తు ‘ఉఫ్’
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అమలుచేస్తున్న ఉచిత విద్యుత్తు భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు చూస్తోంది.
ఆరు దశల పరిశీలన పేరుతో లబ్ధిదారుల ఏరివేత
అల్లూరి జిల్లాలో 20 వేల మందికి పైగా అనర్హులుగా గుర్తింపు
ఈనాడు డిజిటల్, పాడేరు, న్యూస్టుడే పాడేరు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అమలుచేస్తున్న ఉచిత విద్యుత్తు భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు చూస్తోంది. సంక్షేమ పథకాలకు కొలమానంగా తీసుకుంటున్న ఆరుదశల (సిక్స్ స్టెప్) పరిశీలనను 200 యూనిట్లలోపు వినియోగించే ఉచిత విద్యుత్తు లబ్ధిదారులపైనా ప్రయోగిస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లతో ప్రత్యేకంగా సర్వేచేయించి పరిమితికి మించి భూములున్నాయని, నాలుగు చక్రాల వాహనాలున్నాయని, కుటుంబంలో ఉద్యోగస్థులున్నారని వేల మందిని అనర్హులుగా గుర్తించింది. వారంతా తక్షణం విద్యుత్తు బిల్లులతో పాటు పాత బకాయిలు కూడా చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తోంది. అల్లూరి జిల్లాలో సుమారు 20 వేలకు పైగా ఎస్టీ కుటుంబాలను ఉచిత విద్యుత్తు పథకం నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వీరంతా అర్హులని నిరూపించుకోవాలని, లేకుంటే బిల్లులైనా చెల్లించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
అల్లివరంలో సరఫరా నిలిపివేత
పాడేరు మండలం అల్లివరం గ్రామానికి చెందిన వారంతా ఆదివాసీయులు. రోజు వారీ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ప్రభుత్వం తాజాగా చేపట్టిన సర్వేలో వీరంతా దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నారని తేలిందట. దీంతో వారంతా ఉచిత విద్యుత్తుకు అనర్హులుగా పేర్కొంటూ అధికారులు బిల్లులు జారీచేశారు. పాత బకాయిలు కూడా ఉన్నాయంటూ రూ.వేలల్లో బిల్లులు చేతిలో పెట్టారు. ఇప్పటి వరకు కరెంటు బిల్లు ఎరగని వారంతా ఒకేసారి రూ.వేలల్లో చెల్లించాల్సి రావడంతో ఆందోళనకు గురయ్యారు. ఈలోగా ఆకస్మిక తనిఖీల పేరుతో వెళ్లిన విద్యుత్తు సిబ్బంది..గ్రామంలోని 63 కుటుంబాలకుగాను బిల్లులు చెల్లించని 30 ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపేశారు. మూడు రోజుల పాటు వారంతా అంధకారంలో మగ్గారు. దీనిపై ‘ఈటీవీ’లో వార్త ప్రసారం కావడంతో ఆ ఇళ్లకు శుక్రవారం విద్యుత్తు సరఫరాను పునురుద్ధరించారు. తామంతా నిరుపేదలమని, బకాయిలను తాము చెల్లించలేమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రూ.11 వేలు బిల్లు రావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.
నోటీసు లేకుండా తొలగించారు
మాది నిరుపేద కుటుంబం. చాలా ఏళ్లుగా రాయితీ విద్యుత్తు పొందుతున్నాం. ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి మా ఇళ్లకు వచ్చి కరెంటు నిలిపేశారు.
పాంగి సూరిబాబు, అల్లివరం
రాయితీ ఎత్తేశామని చెబుతున్నారు..
గత ఐదేళ్ల నుంచి రాయితీ విద్యుత్తును ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్నట్టుండి పాత బకాయిలన్నీ కలిపి ఒకేసారి పెద్ద మొత్తంలో బిల్లులు ఇచ్చి కట్టమంటున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు బిల్లు వచ్చింది. రాయితీ మీకు ఎత్తేశారని, ఈ డబ్బులు చెల్లించడం లేదు కనుక, విద్యుత్తు సరఫరాను ఆపేస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.
సోమేష్, అల్లివరం గ్రామం
కరెంటు సరఫరా పునరుద్ధరించాం..
సచివాలయ సర్వే ప్రకారం అర్హులకు మాత్రమే రాయితీ విద్యుత్తు అందుతుంది. ఒకవేళ అర్హులను అనర్హులుగా గుర్తిస్తే వారు ఆధార్, కులధ్రువీకరణ పత్రం సచివాలయంలో ఇస్తే వారికి రాయితీ పునరుద్ధరిస్తారు. అల్లివరంలో కొన్ని ఇళ్లకు విద్యుత్తు నిలిపివేసినట్లు తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో మాట్లాడి సరఫరా పునరుద్ధరించాం. రాయితీ విద్యుత్తు వినియోగదారుల్లో అనర్హులను మాత్రమే తొలగిస్తాం.
మహేంద్రనాథ్, ఎస్ఈ, ఈపీడీసీఎల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..