Andhra News: నేడు ఇలా ఉంది.. రేపు ఎలా ఉంటుందో..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ఆదుర్రు బౌద్ధ స్తూపం సమీపంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది.

Published : 04 Dec 2022 08:31 IST

నెర్రెలిచ్చిన పైకప్పునకు పరదాలతో సరి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ఆదుర్రు బౌద్ధ స్తూపం సమీపంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 24 మంది విద్యార్థులు చదువుతున్నారు. భవనం పైకప్పు నెర్రెలు తీసి ఇనుప ఊచలు తేలి పెచ్చులూడి పడుతున్నాయి. వర్షం నీరు లీకవుతుండడంతో మరింత కలవరపెడుతోంది. దీంతో ఉపాధ్యాయులు స్లాబు నుంచి నీరు లీకవ్వకుండా భవనంపై ప్లాస్టిక్‌ కవర్‌ కప్పారు. వసతి చాలకపోవడంతో అందులోనే తరగతులు నిర్వహించాల్సి వస్తుండడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

న్యూస్‌టుడే, మామిడికుదురు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని