‘నగరవనం..’ నిర్వహణ అధ్వానం
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నగరవనాలు.. ఇప్పుడు సరైన నిర్వహణ లేక అధ్వానంగా కనిపిస్తున్నాయి.
రూపుకోల్పోయి కళావిహీనం
అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన వైనం
‘ఈనాడు’ ప్రతినిధుల పరిశీలన
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నగరవనాలు.. ఇప్పుడు సరైన నిర్వహణ లేక అధ్వానంగా కనిపిస్తున్నాయి. నగరవాసులు సేదతీరేందుకు వీలుగా రూపొందించిన ఈ వనాలు చాలా చోట్ల రూపుకోల్పోయాయి. కుటీరాలు, చిన్న పిల్లల పార్కులు, బోటు విహారాలు వంటివన్నీ ధ్వంసమయ్యాయి. కొన్ని నగరవనాలైతే మందుబాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరవనాల్ని ‘‘ఈనాడు’’ ప్రతినిధులు పరిశీలించారు. వాటి దుస్థితికి నిదర్శనమే ఈ చిత్రాలు.
నాడు ఆహ్లాదంగా...
పచ్చని కొండల నడుమ పేరేచెర్ల నగరవనంలో ఏర్పాటు చేసిన ఈ కుటీరం గుంటూరు నగర వాసులు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ఒకప్పుడు ఆహ్లాదం పంచేది. సందర్శకులు భారీగా తరలివచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకుని సేదతీరేవారు. ఇదంతా ఒకప్పటి సంగతి.
నేడు శిథిలమై ఇలా..
మూడున్నరేళ్లుగా ఈ నగరవనం నిర్వహణను సరిగ్గా పట్టించుకోకపోవటంతో అక్కడంతా అస్తవ్యస్తంగా మారింది. ఆ కుటీరం చుట్టూ పిచ్చిమొక్కలు అంత ఎత్తున పెరిగిపోయాయి. ఆ కుటీరం కూడా బల్లలు పాడైపోయి.. పైకప్పు విరిగిపోయి శిథిలావస్థకు చేరింది.
బార్లో సిట్టింగ్ ఏర్పాటు కాదు... నగరవనంలో వీక్షణ ప్రదేశం
ఈ చిత్రం చూసి ఇదేదో బార్లో మందుబాబుల సిట్టింగ్ కోసం చేసిన ఏర్పాటు అనుకుంటున్నారా? కానే కాదు.. విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని నగరవనంలో ఓ భాగమిది. ఇక్కడ కూర్చొని ప్రకృతిని ఆస్వాదించేందుకు, సేదతీరేందుకు వీలుగా పడవ ఆకారంలో ఈ వీక్షణ ప్రదేశాన్ని గతంలో ఏర్పాటు చేశారు. నిర్వహణను గాలికొదిలేయటంతో ఇప్పుడిది మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అటువైపు అడుగుపెట్టాలంటేనే సందర్శకులు ఆందోళన చెందుతున్న పరిస్థితి.
నమ్మండి.. ఇది పిల్లల పార్క్ అండి
కర్నూలు సమీపంలోని గార్గేయపురం నగరవనం పిచ్చిమొక్కలు, ముల్లచెట్లు పెరిగి.. అటవీ శాఖ నిర్లక్ష్యానికి నిలువటద్దంగా నిలుస్తుంది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ పార్కు పొదలతో నిండిపోయింది. క్రీడా పరికరాలు విరిగిపోయాయి.
పుష్కరవనం...ఆ ఘనత కనం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్చెరువు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నగరవనం ఇది. ఈ నగరవనంలో భాగంగా ఏర్పాటు చేసిన అడ్వెంచర్ జోన్ సందర్శకులను విపరీతంగా ఆకర్షించేది. ఆ పరికరాలన్నీ ఇప్పుడు పాడైపోయి ఇలా కనిపిస్తున్నాయి.
చుట్టూ ఎండిన మోడులే
నగరవనం అంటే ఆహ్లాదపరిచేలా.. సేదతీర్చేలా ఉండాలి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద ఏర్పాటు చేసిన నగరవనం గతంలో ఇలాగే ఉండేది. నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో ఈ వనంలో కొంత భాగం ఇలా ఎండిపోయిన చెట్లతో కళావిహీనంగా కనిపిస్తోంది. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు కూడా విరిగిపోయాయి. కనీసం వాటి మరమ్మతులపైనైనా అధికారులు దృష్టిసారించట్లేదు.
‘‘బోటు’’ విహారం దూరం..దూరం
తిరుపతి దివ్యారామంలో ఏర్పాటు చేసిన నగరవనంలో బోట్ల దుస్థితి ఇది. ఈ నగరవనంలోని కొలనులో విహారం కోసం గతంలో బోట్లు అందుబాటులో ఉంచారు. వాటి నిర్వహణ పట్టించుకోకపోవటంతో అవి ఇలా మూలకు చేరాయి. ఫలితంగా సందర్శకులకు బోటు విహారం దూరమైంది.
ఈనాడు యంత్రాంగం, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్