EPFO: త్వరలో అధిక పింఛను వెబ్లింకు
అధిక వేతనంపై భవిష్యనిధి (ఈపీఎఫ్) చందా చెల్లిస్తున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను పొందేందుకు ఉమ్మడి ఐచ్ఛికాన్ని (ఆప్షన్) ఆన్లైన్ ద్వారా నమోదుకు ప్రత్యేక వెబ్లింకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్వో వెల్లడించింది.
ఈనాడు, హైదరాబాద్: అధిక వేతనంపై భవిష్యనిధి (ఈపీఎఫ్) చందా చెల్లిస్తున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను పొందేందుకు ఉమ్మడి ఐచ్ఛికాన్ని (ఆప్షన్) ఆన్లైన్ ద్వారా నమోదుకు ప్రత్యేక వెబ్లింకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్వో వెల్లడించింది. 2014 సెప్టెంబరు 1కి ముందు సర్వీసులో చేరి, 2014 సెప్టెంబరు 1 తరువాత సర్వీసులో కొనసాగుతూ ఉద్యోగుల పింఛనునిధి చట్టం-1995 పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ మేరకు ఈపీఎఫ్వో వెబ్సైట్లో సమాచారాన్ని పొందుపరిచింది. ఈ ప్రత్యేక ఆన్లైన్ దరఖాస్తు సదుపాయం రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి.
* 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసి, సర్వీసులో ఉన్నప్పుడు యజమానితో కలిసి పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన పలువురి అభ్యర్థనను ఈపీఎఫ్వో తిరస్కరించింది. తాజా తీర్పుతో వీరికి వెసులుబాటు లభించింది. ఇలాంటి పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు మరోసారి ఐచ్ఛికం నమోదుకు ఈపీఎఫ్వో మెంబర్ పోర్టల్లో ప్రత్యేక లింకును పొందుపరిచింది. ఈ ఆన్లైన్ లింకు వారం రోజులుగా సరిగా పనిచేయకపోవడంపై అర్హులైన ఈపీఎఫ్వో పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దరఖాస్తు గడువు ముగియనున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలి
అధిక పింఛను ఐచ్ఛికం ఎంపికతో కలిగే ప్రయోజనాలపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సమగ్ర మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య కోరింది. ఈ మేరకు సమాఖ్య ఛైర్మన్ బాలకిషన్, ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్ తదితరులు గురువారం హైదరాబాద్లోని ప్రాంతీయ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘‘లక్షల మందికి సంబంధించిన కీలకమైన అంశమైనప్పటికీ అధికారికంగా విధివిధానాలు వెల్లడికాలేదు. ఉద్యోగులు, పింఛనుదారులు అయోమయానికి గురై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా, శాఖలు, సంస్థల పరంగా కూడా దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీకాలేదు. దీంతో అమలుపై అనుమానాలు నెలకొన్నాయి. అధిక పింఛను దరఖాస్తుకు ఉద్దేశించిన జాయింట్ ఆప్షన్ ఫాంను, మార్గదర్శకాలను వెంటనే వెబ్సైట్లో పెట్టాలి. దరఖాస్తుకు పది రోజుల కంటే తక్కువ గడువు ఇచ్చారు. ఈ గడువును రెండు నెలల పాటు పొడిగించాలి’’ అని వినతిపత్రంలో కోరారు.
ఈపీఎఫ్వో సమస్యల పరిష్కారానికి 27న ‘నిధి ఆప్కే నికత్’ కార్యక్రమం
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ బర్కత్పుర ప్రాంతీయ కార్యాలయం పరిధిలో నాలుగు చోట్ల ఈ నెల 27న ‘నిధి ఆప్కే నికత్-2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్-2 అర్జున్ తుక్రాల్ తెలిపారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లిలోని జెనారా ఫార్మా లిమిటెడ్లో, సూర్యాపేట జిల్లా.. సూర్యాపేట అమరవాడినగర్లోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో, యాదాద్రి-భువనగిరి జిల్లా.. భువనగిరి పురపాలక కార్యాలయంలో, నల్గొండలోని సహకార బ్యాంకు ఆవరణలో నిధి ఆప్కే నికత్ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..