ఫెర్రో పరిశ్రమలపై రూ.300 కోట్ల భారం
ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలపై విద్యుత్తు డిమాండ్ ఛార్జీల పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకులతో నష్టాల్లో ఉన్న ఈ పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కిలోవాట్కు రూ.475 చొప్పున డిమాండ్ ఛార్జీల భారం మోపనుంది.
ఇతర వర్గాల టారిఫ్లో పెంపు లేదు
2023-24 విద్యుత్తు ఛార్జీలను వెల్లడించిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలపై విద్యుత్తు డిమాండ్ ఛార్జీల పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకులతో నష్టాల్లో ఉన్న ఈ పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కిలోవాట్కు రూ.475 చొప్పున డిమాండ్ ఛార్జీల భారం మోపనుంది. విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు పెట్టిన ఈ అదనపు ఛార్జీల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదముద్ర వేసింది. దీనివల్ల డిస్కంలకు సుమారు రూ.300 కోట్ల మేర రెవెన్యూ లోటు తీరనుండగా ఆ మేరకు ఫెర్రో పరిశ్రమలపై అదనపు భారం పడనుంది. శనివారం విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో 2023-24 రిటైల్ సప్లయ్ టారిఫ్ ఉత్తర్వులను ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ డిస్కంలు వార్షిక ఆదాయ అవసరాలను గత నవంబర్లో సమర్పించగా ఈ ఏడాది జనవరిలో వర్చువల్గా ప్రజాభిప్రాయసేకరణ జరిపి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఫెర్రో పరిశ్రమలు మినహా ఇతర వర్గాలపై ఏ భారమూ లేకుండా డిస్కంల ప్రతిపాదనలను సమ్మతించినట్లు చెప్పారు. ఫెర్రో పరిశ్రమల నుంచి అదనపు వసూళ్లకు డిస్కంలు మూడు ప్రతిపాదనలు పెట్టగా అందులో డిమాండ్ ఛార్జీలకు మాత్రమే అనుమతించామన్నారు. అయినా మిగతా రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో ఈ పరిశ్రమల ఛార్జీలు తక్కువేనని సమర్ధించుకున్నారు.
డిస్కంల ఆదాయ అవసరం రూ.49,267 కోట్లు
‘ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్.. ఈ మూడు డిస్కంలు కలిపి రూ.52,591 కోట్ల ఆదాయ అవసరాలను ప్రతిపాదించాయి. వీటిని ఏపీఈఆర్సీ తరఫున క్షుణ్ణంగా పరిశీలించాం. విద్యుత్తు అమ్మకాలు, సరఫరా నష్టాలు, కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు కొరత, టైమ్ ఆఫ్ డే (టీవోడీ) ఆధారంగా డిమాండ్, లభ్యతను అంచనా వేశాం. డిస్కంల స్వల్పకాలిక కొనుగోళ్లను నియంత్రించడంలో నిబంధనల అమలును దృష్టిలో పెట్టుకుని వాస్తవిక ఆదాయ అవసరాన్ని రూ.49,267.36 కోట్లుగా నిర్ణయించాం’ అని ఈఆర్సీ ఛైర్మన్ పేర్కొన్నారు.
లోటు మొత్తం ప్రభుత్వమే ఇస్తుంది
‘మూడు డిస్కంలు తమ రెవెన్యూ లోటును రూ.14,028.76 కోట్లు పేర్కొన్నాయి. మా పరిశీలన అనంతరం వాస్తవిక లోటు రూ.10,135 కోట్లుగానే నిర్ణయించాం. ఈ మొత్తమంతా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ రూపంలో ఇస్తున్నదే. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా రెవెన్యూ లోటును సబ్సిడీగా చెల్లించేందుకు సమ్మతించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం వేసే అవసరం లేకుండా పోయింది’ అని వివరించారు.
మరమగ్గాలు, పిండిమిల్లుల వారికి ఉపశమనం
ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన వినతులను పరిశీలించి మరమగ్గాలు (పవర్లూమ్స్), పిండి మిల్లులకు 10 హెచ్పీ వరకు కేవీఏహెచ్ బిల్లింగ్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. దీనివల్ల ఆయా రంగాలపై విద్యుత్తు బిల్లులు కొంత తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే ఆఫ్ సీజన్ ఐచ్ఛికాన్ని సంవత్సరానికి రెండుసార్లుగా మార్చినట్లు తెలిపారు. సౌరవిద్యుత్తులో ఏదైనా సమస్య ఉంటే సోలార్ పంప్సెట్లు వాడుతున్న అర్హులైన రైతులకు డిస్కంలు ఉచిత విద్యుత్తును ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల మంజూరులో సీనియార్టీ పాటించకుంటే సంబంధిత వ్యక్తులపై చర్యలకు కమిషన్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల సరఫరాను నిర్ధారించడానికి జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్ను డిస్కంలు వారి వెబ్సైట్లలో ఉంచాలని ఆదేశించినట్లు ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ˆఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్సింగ్, పి.రాజగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు టారిఫ్ పుస్తకానికీ ఆ రంగే!
రానున్న ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే విద్యుత్తు టారిఫ్ ఛార్జీలకు సంబంధించిన నివేదికను ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి శనివారం విడుదల చేశారు. పుస్తక రూపంలో ఉన్న ఈ నివేదిక కవర్ పేజీ వైకాపా పార్టీ రంగులను పోలినట్లు తీర్చిదిద్దారు. ఆ పుస్తకాలను ఆవిష్కరించిన సమయంలో ఇవి ప్రభుత్వ నివేదికలా.. పార్టీ కరపత్రాలా? అని సమావేశంలో పాల్గొన్న వారిలో కొంతమంది చర్చించుకున్నారు. ఈపీడీసీఎల్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఈ విధంగా నివేదిక ముఖచిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..