సంక్షిప్త వార్తలు (5)
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు గురువారం రాత్రి సందర్శించారు.
ద్రాక్షారామ ఆలయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పూజలు
ద్రాక్షారామ, పిఠాపురం, న్యూస్టుడే: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు గురువారం రాత్రి సందర్శించారు. వీరికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా మంత్రి వేణుగోపాలకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. స్వామి వారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని న్యాయమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రామసుబ్రమణియన్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరిదేవి, పురుహూతికా అమ్మవారిని దర్శించుకున్నారు.
పోక్సో కేసుల్లోని ఉపాధ్యాయుల వివరాలు కోరిన విద్యాశాఖ
ఈనాడు, అమరావతి: విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసు (పోక్సో)ల్లో సస్పెండైన ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని జిల్లా విద్యాధికారులు, ఆర్జేడీలను పాఠశాల విద్యాశాఖ కోరింది. పోక్సో సహా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులతో పాటు క్రమశిక్షణ చర్యల గడువు పూర్తయిన వారి వివరాలనూ ఇవ్వాలని పేర్కొంది.
డాల్ఫిన్ వదనం.. మామిడి అందం
తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకలోని పచ్చని విరివనాల్లో డాల్ఫిన్ ఆకారంలో మామిడికాయ ఇలా కనువిందు చేస్తోంది. దీన్ని చిలకముక్కు మామిడి అని పిలుస్తారని స్థానిక రైతు కుప్పాల దుర్గారావు చెప్పారు. దీనికి సంబంధించిన తల్లి చెట్టు నుంచి అంటు మొక్కలను ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు.
న్యూస్టుడే, కడియం
చిత్తూరు జిల్లాలో మూడు కొవిడ్ కేసులు
తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్టుడే: చిత్తూరు జిల్లా రామకుప్పానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులకు కొవిడ్ నిర్ధారణ అయింది. ఆ కుటుంబానికి చెందిన యువకుడు (24) దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురికావడంతో బుధవారం ర్యాపిడ్ పరీక్ష చేయించుకున్నారు. కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ కావడంతో వెంటనే అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులనూ పరీక్షించగా గురువారం రాత్రికి వచ్చిన ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో అతని తల్లి (43), అత్త (61)కు కొవిడ్ నిర్ధారణ అయింది.
అనుమతుల పేరిట అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవద్దు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆదేశం
ఈనాడు డిజిటల్, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ]్కర్ విగ్రహాల ఏర్పాటు, ఆవిష్కరణలను అనుమతుల పేరిట అడ్డుకోవద్దని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ‘అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటు, ఆవిష్కరణలపై స్థానిక అధికారులు కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని కమిషన్ దృష్టికి వచ్చింది. ఆ కార్యక్రమాలను అనుమతుల పేరిట అడ్డుకోవద్దు. తమ ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కోరితే అనుమతివ్వాలి. రక్షణ కల్పించాలి. విధిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు పాటించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్