వారు విచారణను ప్రభావితం చేయగలరు
వివేకా హత్య కేసులో నిందితులు పలుకుబడి ఉన్నవారని, అన్ని రకాలుగా విచారణను అడ్డుకునే సామర్థ్యం ఉందని, అందువల్ల విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు తనను అనుమతించాలంటూ మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు నాకు అనుమతించండి
సీబీఐ కోర్టులో సునీతారెడ్డి పిటిషన్
ఈనాడు, హైదరాబాద్: వివేకా హత్య కేసులో నిందితులు పలుకుబడి ఉన్నవారని, అన్ని రకాలుగా విచారణను అడ్డుకునే సామర్థ్యం ఉందని, అందువల్ల విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు తనను అనుమతించాలంటూ మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షుల్లో ఒకరి అనుమానాస్పద మృతి, సీఐ శంకరయ్యతో సహా ఇతర సాక్షులు ప్రాసిక్యూషన్కు సహకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరైన విచారణ జరిపి న్యాయం పొందేందుకుగాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కె.గంగాధర్రెడ్డి సీబీఐని ఆశ్రయించి వివేకా హత్య కేసు బాధ్యతను తీసుకుంటే రూ.10 కోట్లు వై.ఎస్.అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డిలు ఇస్తారని శివశంకర్రెడ్డి చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చారన్నారు. మేజిస్ట్రేట్ ముందు ఇదే విషయాన్ని చెప్పాల్సి ఉండగా మాట మార్చి మీడియా ముందుకు వచ్చి సీబీఐ ఒత్తిడి తీసుకువస్తోందని పేర్కొన్నారన్నారు. అనంతరం అనుమానాస్పద స్థితిలో గంగాధర్రెడ్డి మృతి చెందారని తెలిపారు. వై.ఎస్.భాస్కర్రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని చెప్పడం, తరవాత సంఘటన స్థలానికి చేరుకోగా బెదిరించినట్లు పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి, మేజిస్ట్రేట్ ముందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించడంతో సీఐపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఫిర్యాదుదారు ఎం.వి.కృష్ణారెడ్డి సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. శివశంకర్రెడ్డి సన్నిహితుడు ఉదయ్రెడ్డి సీబీఐకి అన్ని అంశాలను తెలిపారని, చివరికి దర్యాప్తు అధికారి రాంసింగ్ వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అప్రూవర్గా మారిన దస్తగిరి సోదరుడు మస్తాన్పై సర్పంచి దాడి చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టుకు సహకరించడానికి రాకతప్పలేదన్నారు. అందువల్ల తన తరఫున న్యాయవాదిని కోర్టులో వాదనలు వినిపించడానికి, సాక్షులను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు తన తరఫు న్యాయవాదులు టి.స్వేచ్ఛ, ఎస్.గౌతమ్, పి.రాజేందర్లను అనుమతించాలని కోరారు. సీఆర్పీసీ సవరించిన సెక్షన్లతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు తన తరఫున న్యాయవాదులను అనుమతించాలన్నారు. ఈ పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్.రమేశ్బాబు ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేశారు. వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా శుక్రవారం నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డి, యాదాటి సునీల్యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డిలు హాజరుకాగా, దస్తగిరి గైర్హాజరయ్యారు.
గంగిరెడ్డికి మరోసారి నోటీసులు
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన గంగిరెడ్డికి బెయిలు రద్దు పిటిషన్లో శుక్రవారం తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గంగిరెడ్డికి నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ సుప్రీం కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన విషయం విదితమే. దీనిపై గత వారం నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం మరోసారి న్యాయమూర్తి చిల్లకూరు సుమలత విచారణ చేపట్టగా గంగిరెడ్డికి నోటీసులు అందకపోవడంతో ఆయన తరఫు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేస్తూ వ్యక్తిగతంగా గంగిరెడ్డికి అందజేయాలంటూ సీబీఐకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..