అప్పులతోనే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి
రాష్ట్రం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అప్పులతోనే ప్రారంభిస్తోంది. విశ్వ ప్రయత్నాలతో రూ.3,000 కోట్ల రుణం స్వీకరించేందుకు కేంద్రం నుంచి అనుమతులు పొందింది.
ఏప్రిల్ 5న రూ.3,000 కోట్ల రుణానికి అనుమతులు
చివర్లో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం
వచ్చే నిధులూ తెచ్చుకోలేకపోయిన వైనం
ఈనాడు, అమరావతి: రాష్ట్రం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అప్పులతోనే ప్రారంభిస్తోంది. విశ్వ ప్రయత్నాలతో రూ.3,000 కోట్ల రుణం స్వీకరించేందుకు కేంద్రం నుంచి అనుమతులు పొందింది. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అప్పులకు కేంద్రం నుంచి ఇంత త్వరగా అనుమతులు రావడం అరుదు. రాష్ట్ర పెద్దలు, అధికారులు దిల్లీ స్థాయిలో సాగించిన ప్రయత్నాలతోనే ఈ అనుమతులు దక్కినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే బుధవారం రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో రూ.3,000 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఒక్క రాష్ట్రం మాత్రమే ఆ రోజు సెక్యూరిటీల వేలంలో పాల్గొంటుండటం విశేషం. ఆరేళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా రూ.వేయి కోట్లు, తొమ్మిదేళ్ల కాలపరిమితితో తీర్చేలా రూ.వేయి కోట్లు, పదేళ్ల కాలపరిమితితో చెల్లించేలా మరో వెయ్యి కోట్ల రుణం సమీకరిస్తోంది. కేంద్రం నుంచి తాజాగా అనుమతులు వచ్చినందున ఇందుకు అవకాశమేర్పడింది. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన విషయం తెలిసిందే.
ప్రాయోజిత పథకాల నిధులేవీ?
2022-23 ఆర్థిక సంవత్సరం చివరలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవడంలో అధికారులు సరిగా వ్యవహరించలేదనే చర్చ సాగుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి దాదాపు రూ.6,000 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఆ నిధులకు రాష్ట్రం తన వాటా నిధులు జమ చేయాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తాలు జమ చేస్తామని చెప్పి ప్రయత్నించినా కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో నిధులు రాబట్టుకోలేకపోయారని విశ్వసనీయ సమాచారం. మరో వైపు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అభివృద్ధి పనులకు చెల్లింపులు జరిపి ఆ వివరాలు కేంద్రానికి సమర్పించి ఉంటే ప్రత్యేక సాయం కింద రూ.1,500 కోట్ల వరకు నిధులొచ్చే అవకాశమున్నా తగిన సమయంలో ప్రక్రియ పూర్తి చేయనందున అవీ అందుకోలేకపోయారని సమాచారం. ఇలా వివిధ రూపాల్లో కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.పది వేల కోట్లు రాబట్టుకోవడంలో ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోయిందని సమాచారం. అత్యంత పెద్దస్థాయి సిఫార్సులతో వివిధ శాఖలకు చెందిన దాదాపు రూ.2,400 కోట్ల బిల్లుల సొమ్ము చివరి రోజుల్లో చెల్లింపులు సాగాయని చెబుతున్నారు. అనేకమంది బిల్లుల కోసం నిరీక్షించినా చెల్లింపులు సాగలేదు.
కరెంట్ ఖాతాకు జమ చేయండి
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా డబ్బులుంటే వాటిని తక్షణమే వెనక్కు చెల్లించాలని ఖజానా అధికారులు సంబంధిత అధికారులకు వర్తమానం పంపారు. ఖజానా బ్యాంకులను అప్రమత్తం చేసి యూజర్ ఛార్జీలు, ఇతరత్రా వసూళ్లకు సంబంధించిన ఏ సొమ్ములున్నా తక్షణమే వాటిని ప్రభుత్వానికి జమ చేయాలని ఖజానాశాఖ సంచాలకులు తెలిపారు. సంబంధిత హెడ్ ఆఫ్ అకౌంట్ నెంబరును తెలిపారు. కరెంటు ఖాతాలో సొమ్ములన్నీ జమ చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?