సామాన్య ప్రయాణికులపై రైల్వే శాఖ నిర్లక్ష్యం
పేదలు, సామాన్యులు, వలస కూలీలు, దిగువ మధ్య తరగతి ప్రజలు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలపై రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపిస్తోంది.
స్లీపర్ బోగీల తగ్గింపు, ఏసీలు పెంపు
రాబడి పెంచుకోవడంపైనే దృష్టి
ఈనాడు, అమరావతి: పేదలు, సామాన్యులు, వలస కూలీలు, దిగువ మధ్య తరగతి ప్రజలు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలపై రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపిస్తోంది. ప్రయాణికుల రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీలను పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. జనరల్ బోగీలను మొక్కుబడిగా ఒకటి, రెండుకి పరిమితం చేయడం, స్లీపర్ బోగీలను తగ్గించేయడం కొంతకాలంగా ఎక్కువైంది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు నరకం చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లలో ఇదే దుస్థితి నెలకొంది. ఇదేమని రైల్వే అధికారులను అడిగితే.. ఉన్నతస్థాయి నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడమే తప్ప, తాము చేయగలిగేది ఏమీ లేదని బదులిస్తున్నారు.
జనరల్ బోగీ ప్రయాణం.. ప్రత్యక్ష నరకం
అన్ని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణం అంటే అదో ప్రత్యక్ష నరకంలా మారింది. దాదాపు అన్ని రైళ్లలో జనరల్ బోగీలు రెండే ఉంటున్నాయి. కొన్నింటికి ఒక్కటి మాత్రమే ఉంచారు. దీంతో రిజర్వేషన్ లేకుండా సాధారణ టిక్కెట్ తీసుకొని ప్రయాణించాలనుకునే వారంతా ఈ రెండు బోగీల్లోనే ఇరుక్కొని ప్రయాణించాల్సి వస్తోంది. వీటిలో కాలు కదిపేందుకు కూడా అవకాశం ఉండటం లేదు. స్థలంలేక కొందరు బాత్రూమ్లలో సైతం కూర్చొని ప్రయాణిస్తున్నారు.
స్లీపర్ బెర్తు దొరకడం అదృష్టమే
అనేక రైళ్లలో గతం కంటే స్లీపర్ బోగీలను తగ్గించి, వాటి స్థానంలో ఏసీ బోగీలను క్రమంగా పెంచుతూ వెళ్తున్నారు. దీంతో స్లీపర్ బెర్త్ దొరకడమే గగనంగా మారింది. పలు ఎక్స్ప్రెస్లలో స్లీపర్లలో నిరీక్షణ జాబితా 100-150 మధ్య ఉంటోంది. బోగీలు తగ్గించడంతో వాటిలో రిజర్వేషన్ ఖరారుకాక, నిరీక్షణ జాబితాలో ఉన్నవారు సైతం పెద్దసంఖ్యలో ప్రయాణిస్తున్నారు. దీంతో అవి కూడా జనరల్ బోగీలను తలపిస్తున్నాయి.
అధిక మొత్తం వెచ్చించలేక
స్లీపర్ బెర్తులు లభించక థర్డ్ ఏసీకి ఎక్కువ మొత్తం వెచ్చించే స్తోమత లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు గోదావరి ఎక్స్ప్రెస్లో స్లీపర్ బెర్త్కు రూ.415 ఛార్జి ఉంటే, అదే థర్డ్ ఏసీకి రూ.1,090, సెకండ్ ఏసీకి రూ.1,535, ఫస్ట్ ఏసీకి రూ.2,565గా ఉంది. తిరుమల ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి తిరుపతికి స్లీపర్ బెర్త్కు రూ.245 ఉంటే, థర్డ్ ఏసీలో రూ.660 ఉంది.
ఇలా తగ్గించారు..
* భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఒకప్పుడు థర్డ్ఏసీ బోగీలు 3 ఉండేవి. వాటిని 6కి పెంచారు. గతంలో 9-10 ఉండే స్లీపర్ బోగీలను 6కి కుదించారు.
* హావ్డా-చెన్నై మెయిల్లో స్లీపర్ బోగీలు 12 ఉండగా, వాటిని 5కి తగ్గించారు. థర్డ్ ఏసీ 9కి పెంచారు.
* ధన్బాద్-అలప్పుజ ఎక్స్ప్రెస్లో స్లీపర్ బోగీలు 5కి తగ్గితే.. థర్డ్ ఏసీ 6, సెకండ్ క్లాస్ ఏసీ 4 పెంచారు.
* విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ప్రెస్లో గతంలో స్లీపర్ బోగీలు 12 వరకు ఉండేవి. ప్రయాణికుల రద్దీని బట్టి అదనంగా ఒకటి, రెండు జత చేసేవారు. ఇప్పుడు వాటిని 7కి తగ్గించారు. థర్డ్ ఏసీ బోగీలు నాలుగు నుంచి ఏడుకి పెంచారు.
* విశాఖపట్నం-తిరుపతి.. మధ్య తిరిగే తిరుమల ఎక్స్ప్రెస్లో స్లీపర్ బోగీలు 10 నుంచి 7కి తగ్గిపోతే.. థర్డ్ఏసీ 3 నుంచి 6కి పెరిగాయి.
* షాలిమార్-చెన్నై మధ్య రాకపోకలు సాగించే కోరమండల్ ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీ బోగీలు 9 ఉండగా, స్లీపర్ 5 మాత్రమే ఉన్నాయి.
భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే విశాఖ ఎక్స్ప్రెస్లో గతంలో 12 స్లీపర్ బోగీలు ఉండేవి. ఇపుడు వాటి సంఖ్య 3కి తగ్గింది. థర్డ్ ఏసీ బోగీలు గతంలో 3-4 ఉండగా, ఇప్పుడవి 10కి పెరిగాయి. ఇదే రైలులో ఉండే జనరల్ బోగీలు రెండు మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..