ఇక తొమ్మిది నెలలే..
‘ఇక 9 నెలల సమయమే ఉంది.. గడప గడపకు కార్యక్రమం ఒక్కటే కాదు.. ఎన్నికల మోడ్లో వేగంగా పనిచేయండి. అన్ని విధాలుగా సిద్ధం కండి’ అని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు స్పష్టం చేశారు.
ఎన్నికల మోడ్లో సన్నద్ధమవండి
మీ నియోజకవర్గంతోపాటు జిల్లా బాధ్యతా మీదే
జీపీఎస్కు ఆమోదం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో మేనిఫెస్టో 99.5 శాతం అమలు చేసినట్లయింది
కేబినెట్ భేటీలో మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ‘ఇక 9 నెలల సమయమే ఉంది.. గడప గడపకు కార్యక్రమం ఒక్కటే కాదు.. ఎన్నికల మోడ్లో వేగంగా పనిచేయండి. అన్ని విధాలుగా సిద్ధం కండి’ అని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు స్పష్టం చేశారు. ‘మీరు కష్టపడి పనిచేయండి. నియోజకవర్గాలను పూర్తిగా చక్కదిద్దుకోండి. మీ జిల్లాల బాధ్యతా మీదే. నియోజకవర్గాల్లో, జిల్లాలో ఏవైనా గ్యాప్లు ఉంటే ఇప్పటి నుంచి సరిదిద్దుకోండి’ అని వారికి చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..
ముందస్తు ఎన్నికలంటూ బయట బాగా చర్చ జరుగుతోంది.. అని కొందరు మంత్రులు సమావేశంలో ప్రస్తావించారు. సీఎం స్పందిస్తూ ‘2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాతే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. గట్టిగా 9 నెలల సమయమే ఉంది. ఇది మనకు చాలా కీలకమైన సమయం. మిగతా చర్చలన్నీ పక్కన పెట్టి ఎన్నికలపై ఫోకస్ పెట్టండి. మీరు కష్టపడి పనిచేయండి. మిగతాది నేను చూసుకుంటా. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని మంత్రులు, ఎమ్మెల్యేలూ జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి. ఇకపైన నిరంతర ప్రజల్లోనే ఉండాలి. పథకాలను అమలుచేసే పనిని నేను చూసుకుంటున్నా, మీ పని మీరు చేయండి’ అని సీఎం మంత్రులకు స్పష్టతనిచ్చారని సమచారం.
తెదేపా మేనిఫెస్టోను పట్టించుకోవద్దు
తెదేపా ఇటీవల విడుదల చేసిన తొలి మేనిఫెస్టో గురించి ఒకరిద్దరు మంత్రులు లేవనెత్తగా, మరికొందరు మంత్రులు అదేముంది కాపీ మేనిఫెస్టో అంటూ కొట్టి పారేశారు. సీఎం కూడా వారితో మాట కలిపారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ హామీల్లో విజయవంతమైనవాటిని, ఇక్కడ మన వద్ద అమ్మ ఒడిలాంటి సక్సెస్ఫుల్ పథకాలను కాపీ పేస్ట్ చేసుకుని తీసుకువచ్చిన మేనిఫెస్టో అది’ అని అభిప్రాయాలను వారంతా వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోనవసరం లేదు. మీ పని మీరు చేయండి. నా పని నేను చేస్తా. మీరంతా కష్టపడి పనిచేస్తే మళ్లీ విజయం మనదే’ అని సీఎం మంత్రులతో అన్నట్లు తెలిసింది.
జీపీఎస్తో ఎవరికీ నష్టం జరగదు
ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్ను తీసుకువచ్చే అంశం చర్చకు వచ్చినప్పుడు సీఎం మాట్లాడుతూ.. ‘దీంతో ఎవరికీ నష్టమైతే జరగదు. ఏమీ లేని చోట మనం ఈ జీపీఎస్ చేస్తున్నాం. రెండేళ్లుగా ఆలోచించి, కసరత్తు చేసి జీపీఎస్పై ఈ నిర్ణయం తీసుకున్నాం. మంచిగా ఆలోచిస్తే ఇది మంచిగా ఉంటుంది, ఇంకో రకంగా ఆలోచించేవారికి వారి ఆలోచనలను బట్టి ఉంటుంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీపీఎస్ స్థానంలో జీపీఎస్కు ఆమోదం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపాక పలువురు మంత్రులు బల్లలు చరిచారు. ‘ఈ నిర్ణయంతో మన మేనిఫెస్టోలోని హామీలను 99.5 శాతం అమలు చేసినట్లవుతుంది’ అని కొందరు మంత్రులు అనగా.. అవునంటూ సీఎం నవ్వులు చిందించారు.
సజ్జల ఇంటికి విజయమ్మ
వైకాపా మాజీ గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. సజ్జల భార్యతో కాసేపు మాట్లాడి వెనుదిరిగారు. ఆ సమయంలో సజ్జల ఇంట్లో లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..