Gudivada Amarnath: గవర్నర్‌ బంగ్లాలో... మంత్రి అమర్‌నాథ్‌కు చుక్కెదురు

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు విశాఖ జిల్లా యంత్రాంగం ఝలక్‌ ఇచ్చింది.

Updated : 10 Mar 2024 14:47 IST

విలేకరుల సమావేశం పెట్టొద్దంటూ అడ్డగించిన అధికారులు 

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు విశాఖ జిల్లా యంత్రాంగం ఝలక్‌ ఇచ్చింది. నగరంలోని గవర్నర్‌ బంగ్లాలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది. ఇన్నాళ్లూ మంత్రి ఇక్కడే విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయపరమైన అంశాలపై ప్రతిపక్షాలను తూలనాడేవారు. తెదేపా-జనసేన-భాజపా కూటమిపై మాట్లాడేందుకు శనివారం సాయంత్రం గవర్నర్‌ బంగ్లాలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. రాజకీయ అంశాలపై ఇక్కడ విలేకరుల సమావేశాలు నిర్వహించొద్దని గవర్నర్‌ బంగ్లా అధికారులు సూచించారు. దీంతో అమర్‌నాథ్‌ చేసేది లేక బంగ్లా వెలుపలే మీడియా ప్రతినిధులతో మాట్లాడి వెనుదిగారు. రాజకీయపరమైన విమర్శలు చేయడానికి గవర్నర్‌ బంగ్లా వేదిక కాకూడదని ఇటీవల యంత్రాంగం నిర్ణయించింది. వారం క్రితం తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటుచేయాలని భావించగా, యంత్రాంగం అడ్డుకుంది. దాంతో ఆమె వైకాపా కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని