తెలంగాణలో 25 లక్షల మంది వినియోగదారులు: హోండా 2వీలర్స్‌

వ్యక్తిగత రవాణాకు గిరాకీ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు హోండా 2వీలర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 31 Dec 2020 01:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యక్తిగత రవాణాకు గిరాకీ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు హోండా 2వీలర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో బుధవారం నాటికి 25 లక్షల మైలురాయిని అధిగమించినట్లు  పేర్కొంది. 2001-2014 మధ్య కాలంలో మొదటి 10 లక్షల మంది వినియోగదారుల సంఖ్యను చేరుకోగా, తదుపరి ఆరేళ్లలో 15 లక్షల మంది వినియోగదారులను సంపాదించుకున్నట్లు వెల్లడించింది. స్కూటర్ల విభాగంలో ఈ ప్రాంతంలో 72శాతం మార్కెట్‌ వాటా సొంతం చేసుకున్నట్లు సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని