
Published : 20 Jan 2022 09:36 IST
Stock Market: మార్కెట్లలో కొనసాగుతున్న బేర్ పట్టు.. నష్టాల్లో సూచీలు
ముంబయి: దేశీయ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో వరుసగా మూడో రోజు సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 18వేల దిగువన ట్రేడ్ అవుతోంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 256 పాయింట్లు కుంగి 59,843 వద్ద.. నిఫ్టీ 63 పాయింట్ల నష్టంతో 17,875 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు రాణిస్తుండగా.. ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, నెస్లే, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి
Tags :