స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణిస్తూనే క్యాబ్‌ బుకింగ్‌

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే, గమ్యస్థానం చేరాక క్యాబ్‌ను బుక్‌ చేసుకునే కొత్త సదుపాయాన్ని స్పైస్‌జెట్‌ అందుబాటులోకి తెచ్చింది. విమానసంస్థకు చెందిన ఇన్‌-ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ‘స్పైస్‌స్క్రీన్‌’ను ఇందుకు ఉపయోగించుకోవచ్చు.

Updated : 13 Aug 2021 06:25 IST

ముంబయి: విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే, గమ్యస్థానం చేరాక క్యాబ్‌ను బుక్‌ చేసుకునే కొత్త సదుపాయాన్ని స్పైస్‌జెట్‌ అందుబాటులోకి తెచ్చింది. విమానసంస్థకు చెందిన ఇన్‌-ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ‘స్పైస్‌స్క్రీన్‌’ను ఇందుకు ఉపయోగించుకోవచ్చు. దీనిలో వివరాలు బుక్‌ చేసుకుంటే, విమానాశ్రయానికి చేరగానే ప్రయాణికుడి మొబైల్‌కు ఓటీపీ, కాల్‌ కూడా వస్తుంది. ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయొచ్చు. తొలి దశలో ఈ సేవను దిల్లీ విమానాశ్రయంలో గురువారం ప్రారంభించారు. త్వరలోనే హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, గోవా, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె విమానాశ్రయాల్లో దశలవారీగా స్పైస్‌జెట్‌ అందుబాటులోకి తేనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని