SBI: ఆన్లైన్ బ్యాంకింగ్ టిప్స్.. మీరు తెలుసుకోండి..
మీకు తెలియని వెబైసైట్ల నుంచి వచ్చే ఇమెయిల్ను తెరిచి చూడటం, ఈమెయిల్కి జోడించిన లింక్స్ను క్లిక్ చేయడం వల్ల మోసాల బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా మెలగడం అవసరం
ఆన్లైన్లో జరుగుతున్న మోసాలను నివారించేందుకు భారతీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులకు కొన్ని సూచునలు జారీచేసింది. ఇంటెర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసంది. ఆన్లైన్ ద్వారా బ్యాంకింగ్ సేవల పొందే వినియోగదారులు చేయవలసిన, చేయకూడని వాటిని తన అధికారిక వెబ్సైట్లో వినియోగదారుల కోసం పొందుపరిచింది.
ఏమి చేయాలి..
* ఆన్లైన్ ద్వారా వెబ్సైట్కు లాగిన్ అయ్యేందుకు మీ బ్రౌజర్ అడ్రస్ బార్లో https://onlinesbi.com యూరల్ టైప్ చేసి యాక్సిస్ కావచ్చు.
* మీ కంప్యూటర్ను క్రమంతప్పకుండా యాంటీవైరస్తో స్కాన్ చేయాలి.
* చివరి లాగిన్ తేది, సమయంను ప్రతీసారి చెక్ చేస్తూ ఉండాలి.
ఏం చేయకూడదు..
* సైట్కి లాగిన్ అయ్యేందుకు మెయిల్ లేదా మెసేజ్ ద్వారా వచ్చిన లింకులపై క్లిక్ చేయడం మంచిది కాదు.
* మీకు తెలియని వెబైసైట్ల నుంచి వచ్చే ఇమెయిల్ను తెరిచి చూడటం, ఈమెయిల్కి జోడించిన లింక్స్ను క్లిక్ చేయడం మానుకోవాలి.
* తెలియని వ్యక్తులు సలహా మేరకు అవసరం లేని యాప్లను డౌన్లోడ్ చేయకండి
* వ్యక్తిగత సమాచారం చెప్తే రివార్డులు ఇస్తామన్న సందేశంతో వచ్చే ఇమెయిల్/ ఎస్ఎమ్ఎస్/ ఫోన్ కాల్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. మీ సమాచారాన్ని ఇవ్వకండి
* బ్యాంకు వెబ్సైట్ సమాచారం అప్డేట్ చేస్తున్న కారణంగా మీ వివరాలు తెలియజేయాలి అని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి.
* ఎస్బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ సంస్థలు, పోలీస్, కేవైసీ అథారిటి నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పి సమాచారం తెలుసుకునేందుకు యత్నిస్తారు. ఈ విధంగా ఫోన్ కాల్స్ వస్తే సైబర్ మోసాలకు పాల్పడే వారి నుంచి వచ్చే కాల్స్గా భావించి వాటిని నివారించండి.
చివరిగా..
ఏ బ్యాంకులైన ఇమెయిల్ ద్వారా గానీ ఇతర మాధ్యమాల ద్వారా గానీ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. పుట్టిన తేది, డెబిట్ కార్డు నెంబర్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్ నెంబర్, సివీవి, ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవ్వరితోనూ షేర్ చేయకండి. ఆన్లైన్ ద్వారా చేసే బ్యాంకు లావాదేవీలను సురక్షితంగా పూర్తిచేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్