కొత్త పన్ను ప్రతిపాదనలతో వీపీఎఫ్ పెట్టుబడులతో లాభం ఉందా?
ఈపీఎఫ్ వడ్డీరేటును యథాతథంగా 8.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
చాలా మంది ప్రజలు తమ పదవీవిరమణ నిధి కోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపిఎఫ్) లో పెట్టుబడి పెడతారు, ఎందుకంటే ఇది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) మాదిరిగా అదే ప్రయోజనాలను పొందుతుంది. ఏదేమైనా, బడ్జెట్ 2021 లో ప్రభుత్వం ఈపీఎఫ్పై పన్నుల మార్పులను ప్రతిపాదించింది, ఇది వీపీఎఫ్ను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి ఈపీఎఫ్ కేటాయింపులు రూ. 2.5 లక్షలకు మించి ఉంటే దానిపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. మరి ఈ ప్రతిపాదన తర్వాత ముఖ్యంగా అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి వీపీఎఫ్లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?
వీపీఎఫ్లో ఒక ఉద్యోగి ఈపీఎఫ్ కింద వారి జీతం నుంచి 12 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని అందించవచ్చు. వీపీఎఫ్పై వడ్డీ రేటు ఈపీఎఫ్తో సమానం, ఇది సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపులో ప్రభుత్వం ప్రకటిస్తుంది. వీపీఎఫ్ కూడా అదే పన్ను ప్రయోజనాలను ఇస్తుంది. మూడుదశల్లో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ను బదిలీ చేసుకున్నట్లే వీపీఎప్ నిధిని కూడా చేయవచ్చు. ఈ రెండూ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) తో అనుసంధానమై ఉంటాయి. ఉపసంహరణ నియమాలు కూడా ఒకటే.
అయితే ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను నిబంధనలు ప్రారంభమైన తర్వాత వీపీఎఫ్ పన్ను నిబంధనలు మారబోతున్నాయి. అయినప్పటికీ ఇది ఆకర్షణీయమైన ఎంపికగా కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ స్థిర పెట్టుబడులకంటే కంటే పన్ను-అనంతర రాబడి మెరుగ్గా ఉంటుంది. ఇతర స్కీముల్లో వడ్డీ రేటు బాగా తగ్గినందున ప్రస్తుతం వీపీఎఫ్ ఆకర్షణీయంగానే ఉంది. పన్ను రహిత బాండ్లు కూడా 4.5 శాతం దిగుబడిని ఇస్తున్నాయి, ఇది వీపీఎఫ్ పన్ను-అనంతర రాబడి కంటే తక్కువగా ఉంది అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
వడ్డీ రేట్లలో మార్పు ఉంటే, దిగుబడి పెరగడం ప్రారంభిస్తే ఇతర ఎంపికల వైపు చూడవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఎంపికలను చూడవచ్చు. సాంప్రదాయిక పెట్టుబడిదారులకు, గిల్ట్ ఫండ్స్ లేదా స్థిరమైన మెచ్యూరిటీ గిల్ట్ ఫండ్స్ లేదా టార్గెట్ డేట్ గిల్ట్ / ఇండెక్స్ ఫండ్స్ మంచి ఎంపిక. కానీ దీనికి ముందు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) పరిమితిని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!