6 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన 3వ విడత భారత్ బాండ్ ఈటీఎఫ్
భారత్ బాండ్ ఈటీఎఫ్ 3వ విడత డిసెంబర్ 3న ప్రారంభించబడింది, డిసెంబర్ 9, 2021న ముగిసింది.
భారత్ బాండ్ ఈటీఎఫ్ 3వ విడత డిసెంబర్ 3న ప్రారంభించబడింది, డిసెంబర్ 9, 2021న ముగిసింది. బేస్ ఇష్యూ పరిమాణం రూ. 1,000 కోట్లతో పోలిస్తే 6.2 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ప్రభుత్వ రంగ రుణ సంస్థలలో పెట్టుబడి పెట్టే ఎక్స్ఛేంజ్ - ట్రేడెడ్ ఫండ్. ఈటీఎఫ్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల `ఏఏఏ` రేటింగ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2032 న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ)లో వీపరీతమైన స్పందన కనిపించింది. మొత్తం సేకరణ రూ. 6,200 కోట్లకు పైగా ఉంది.
రిటైల్ పెట్టుబడిదారుల పెట్టుబడులను సాధారణ మ్యూచువల్ ఫండ్లాగా కొనుగోలు చేయడం / అమ్మడానికి వీలుగా ఈ ఈటీఎఫ్ కోసం ఫండ్ హౌస్ `ఫండ్ ఆఫ్ ఫండ్`ని కూడా ప్రారంభించింది. కొనుగోలుదారులు బాండ్లు మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే భారత్ బాండ్ ఈటీఎఫ్లు ప్రభుత్వ యాజమాన్యంలోని `ఏఏఏ` రేటేడ్ పబ్లిక్ సెక్టార్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం వలన అధిక భద్రతతో అధిక స్థాయి రాబడిని అందిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్