Byjus: కష్టాలు చుట్టుముట్టిన వేళ.. బైజూస్ రవీంద్రన్ కంటతడి!
Byjus Raveendran Broke Down: కంపెనీని కాపాడుకునేందుకు బైజూస్ రవీంద్రన్ ఓ దశలో కంటతడి పెట్టుకున్నారు. ఆ కంపెనీలో ఈడీ సోదాల అనంతరం ఇది జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ (Byjus) ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు నుంచి డైరెక్టర్లు వైదొలగడం, సంస్థకు ఆడిటర్ గుడ్బై చెప్పడం వంటి అంశాలతో ఆ సంస్థ నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ కంపెనీ ఖాతా పుస్తకాల తనిఖీకి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం కొన్ని రోజుల క్రితం ఆదేశించింది. అయితే, ఇలా కంపెనీని వరుస కష్టాలు చుట్టుముట్టిన వేళ.. ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఓ దశలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ కంటతడి పెట్టుకున్నారని తెలిసింది.
ఈ ఏడాది ఏప్రిల్లో రవీంద్రన్ నివాసంతోపాటు బైజూస్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. ఫెమా చట్టం కింద నమోదైన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ అప్పట్లో వెల్లడించింది. విదేశీ మారకానికి సబంధించిన ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దీనిపై ఎలాంటి కేసులూ నమోదవ్వలేదు. ఈ దాడుల అనంతరం కొన్ని రోజుల తర్వాత దుబాయ్లో పలువురు ఇన్వెస్టర్లతో రవీంద్రన్ మాట్లాడారు. మధ్యప్రాచ్యం నుంచి 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ విషయంలో ఆయన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. కంపెనీని కాపాడుకునేందుకు కన్నీటి పర్యంతమయ్యారు. అదే కాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు బ్లూమ్బెర్గ్ తాజాగా వెల్లడించింది.
వేర్వేరు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయా? విలీనం చేయకపోతే ఏమవుతుంది?
కేరళలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన రవీంద్రన్ తొలినాళ్లలో బెంగళూరులో విద్యార్థులకు ట్యూషన్లు బోధించేవారు. అతడి బోధనా పద్ధతుల తీరు ఆకట్టుకోవడంతో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అలా కొన్ని రోజులకే థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోచింగ్ సెంటర్లు ప్రారంభించారు. అలా చిన్నగా ప్రారంభమైన బైజూస్ ప్రస్థానం.. డిజిటల్ రూపు సంతరించుకుంది. జియో ప్రవేశంతో మరింత ఎత్తుకెదిగింది. తొలి నాళ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో కొన్ని కంపెనీలను సైతం బైజూస్ కొనుగోలు చేసింది.
2022లో కరోనా తగ్గుముఖం మొదలైన తర్వాత బైజూస్కు కష్టాలు మొదలయ్యాయి. ఆన్లైన్ ట్యూషన్లకు ఆదరణ తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులూ నెమ్మదించాయి. ఈ క్రమంలోనే ముందుగా హామీ ఇచ్చిన కొన్ని కంపెనీలు పెట్టుబడులకు ముఖం చాటేశాయి. ఈ దశలోనే 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక ఫలితాల వెల్లడిని కంపెనీ ఆలస్యం చేయడంతో కష్టాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఈడీ సోదాలు జరిగాయి. కంపెనీ ఆడిటర్గా ఉన్న డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ గత నెలలో రాజీనామా చేసింది. అదే వారంలో కంపెనీ బోర్డు నుంచి మూడు సంస్థలు వైదొలగాయి. ఇటీవల కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఖాతా పుస్తకాల తనిఖీకి ఆదేశించింది. తాజాగా బైజూస్పై తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ప్రోసస్ ఎన్వీ అనే సంస్థ తాజాగా విమర్శలు గుప్పించింది. కంపెనీ పరిమాణం పెరుగుతూ వచ్చిన క్రమంలో పాలనా పరంగా అవసరమైన మార్పులను సమర్థంగా చేపట్టలేకపోయిందని, తమ డైరెక్టర్లు పలుమార్లు సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టిందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
దేశంలోనే టెలికాం ఛార్జీలు తక్కువగా ఉన్నాయని ఎయిర్టెల్ సీఈఓ అన్నారు. టారిఫ్ రిపేర్ అవసరం అని చెప్పారు. -
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేవైసీ నిబంధనల్ని సడలించింది. ఈమేరకు తాజా సర్క్యులర్ జారీ చేసింది. -
స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై.. త్వరలో కొత్త మార్గదర్శకాలు
స్పామ్ కాల్స్ను నియంత్రించేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇకపై వాటికి స్వస్తి చెప్పేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. -
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 117, నిఫ్టీ 17 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
Google I/O: ఏఐ మోడల్ జెమినీని అప్గ్రేడ్ చేయటంతో పాటు వీడియోతో లెన్స్ సెర్చ్, సర్కిల్తో లెక్కల్లో సాయం, జీమెయిల్లో జెమినీ ఫీచర్స్ వంటి కొత్త అప్డేట్లను గూగుల్ తమ వార్షిక సదస్సులో ప్రకటించింది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
SBI hikes FD rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చాయి. -
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
Go Digit IPO: రూ.2,615 కోట్ల సమీకరణ లక్ష్యంతో గో డిజిట్ ఐపీఓకి వచ్చింది. మదుపర్లు రూ.14,960తో కనీసం 55 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 97 పాయింట్లు పుంజుకొని 73,202 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు ఎగబాకి 22,262 దగ్గర కొనసాగుతోంది. -
ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. -
2023-24లో పీఎస్బీల లాభం రూ.1,41,203 కోట్లు
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్బీ) కలిపి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.1,41,203 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాయి. -
వాహన, లోహ షేర్లకు కొనుగోళ్లు
వరుసగా మూడో రోజూ సూచీల లాభాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రాణించడం, సానుకూల ద్రవ్యోల్బణ గణాంకాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
భారతీ ఎయిర్టెల్ లాభంలో 31% క్షీణత
భారతీ ఎయిర్టెల్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.2,072 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,005.60 కోట్లతో పోలిస్తే, ఇది 31% తక్కువ. -
13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠమైన 1.26 శాతానికి చేరింది. ఆహార వస్తువులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణం. -
వార్షిక ఖర్చులో 6-7% సాంకేతికపైనే
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటా తన వార్షిక నిర్వహణ ఖర్చులో 6-7% సాంకేతికత సంబంధిత అంశాలపైనే ఖర్చు చేస్తోంది. -
భారత్లో లీప్ మోటార్ ఈవీల తయారీ
చైనాకు చెందిన తన భాగస్వామ్య సంస్థ లీప్మోటర్ విద్యుత్ వాహనాలను భారత్లో తయారు చేసి, విక్రయించేందుకు భారత్లోని తన తయారీ కేంద్రాన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థ స్టెల్లాంటిస్ ఉపయోగించుకోనుంది. -
ఎఫ్అండ్ఓ పై పర్యవేక్షణ పెరగాలి
అధిక నష్టభయం ఉండే ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంపై పర్యవేక్షణ లేమి వల,్ల వాటిల్లో ట్రేడ్ చేసే చిన్న మదుపర్ల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లు
టీవీఎస్ మోటార్ తన విద్యుత్తు స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.94,999 (ఎక్స్ షోరూం). -
హైదరాబాద్లో ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్న టేబుల్ స్పేస్
కార్యాలయ స్థలానికి కార్పొరేట్ సంస్థల నుంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని 4 ప్రధాన నగరాల్లో 13.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు టేబుల్ స్పేస్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
ప్రాంతీయ మార్గాల్లో సేవలను విస్తరించే లక్ష్యంతో కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో భావిస్తోంది. ఇందుకోసం 3 విమాన తయారీ సంస్థలు ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్లతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!