సంక్షిప్త వార్తలు (2)
రూ.2 కోట్ల లోపు, ఎంపిక చేసిన కాలావధి గల దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 0.25% పెంచింది. కొత్తరేట్లు నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి.
బీఓబీ డిపాజిట్ రేట్లు 0.25% పెంపు
దిల్లీ: రూ.2 కోట్ల లోపు, ఎంపిక చేసిన కాలావధి గల దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 0.25% పెంచింది. కొత్తరేట్లు నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్తో పాటు బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ (నాన్-కాలబుల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం)పైనా వడ్డీ రేట్లను పెంచింది. 3-5 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లకు 6.5% వడ్డీ ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు ఇది 7.15 శాతంగా ఉంటుంది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై కొత్త రేటు 6.5% కాగా, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం.
బ్యాంకింగ్ ఫండ్లకు వారంలో 6% నష్టం
దిల్లీ: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్లు దివాలా తీసిన ప్రభావం, మన దేశ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్లపైనా పడింది. గత వారంలో ఈ ఫండ్లు 6 శాతం వరకు నష్టపోయాయి. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో, దేశీయంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంపై మదుపర్ల సెంటిమెంటు బలహీనపడింది. ఈ రంగ షేర్లు గత వారం 3-13% వరకు నష్టపోయాయి. బ్యాంకింగ్ షేర్లలో తీవ్ర అమ్మకాల నేపథ్యంలో, ఈ విభాగంలోని 16 పథకాల ఫండ్ల స్వల్ప కాలిక పనితీరు బలహీనపడింది. మార్చి 17తో ముగిసిన వారానికి ఈ ఫండ్లలో 1.6-6% నష్టం వాటిల్లిందని ఏస్ ఎంఎఫ్ నెక్ట్స్ విశ్లేషించింది. ఈ ఏడాదిలో చూస్తే ఇప్పటివరకు ఈ ఫండ్లు 8-10% ప్రతికూల ప్రతిఫలాలు అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
5 శాతానికి పైగా నష్టపోయిన ఎంఎఫ్లు
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ ఎంఎఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్
దీర్ఘకాలంలో బాగున్నాయ్: అయితే 9 నెలలు, ఒక ఏడాది కాల వ్యవధి ప్రకారం చూస్తే, ఈ ఫండ్ల ప్రతిఫలాలు సానుకూలంగా ఉన్నాయి. అన్ని బ్యాంకింగ్, ఆర్థిక సేవల ఫండ్లు వరుసగా 20 శాతం, 12 శాతం లాభాల్ని మదుపర్లకు పంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
Dmart Q4 results: దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్మార్ట్స్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి. -
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్ కామత్. స్పామ్ కాల్స్పై ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?