అధిక పింఛను ఆశావహులకు ఊరట..!
ఈపీఎఫ్వో అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు, పింఛనుదారులు పేరా 26(6)కింద గతంలో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేయకున్నా, తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
పేరా 26(6) ఉమ్మడి ఆప్షన్పై వెనక్కు తగ్గిన ఈపీఎఫ్వో
గతంలో దరఖాస్తు చేయకున్నా తాజాగా ఇచ్చేందుకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్వో అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు, పింఛనుదారులు పేరా 26(6)కింద గతంలో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేయకున్నా, తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఈపీఎఫ్వో జోనల్ కార్యాలయాల అదనపు పీఎఫ్ కమిషనర్లు, ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల్లో ఇచ్చిన వెసులుబాటుపై కొంత స్పష్టత కరవైందని గుర్తించిన కేంద్ర పీఎఫ్ కార్యాలయం ఆవెంటనే సర్క్యులర్ను ఈపీఎఫ్వో పోర్టల్ నుంచి తొలగించింది. త్వరలోనే మరింత స్పష్టత ఇస్తూ ఆదేశాలు ఇస్తామని తెలిపింది.
ప్రస్తుతం ఏం జరుగుతోంది...?
అధికవేతనంపై చందాకోసం 26(6) కింద చాలా మంది ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు. కానీ ఉద్యోగులు, యజమానులూ వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లిస్తూ వచ్చారు. చందా చెల్లించినప్పుడు ఈపీఎఫ్వో అనుమతించింది. ఆ నగదుపై వడ్డీని జమ చేసింది. కానీ అధిక పింఛను దరఖాస్తు సమయంలో పేరా 26 (6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్టు ఆధారాన్ని తప్పనిసరి జతచేయాలని ఆదేశించింది. అధిక పింఛను దరఖాస్తులను పరిష్కరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది పేరా26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఆధారం జతచేయలేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన మొదలైనప్పటి నుంచి ఇప్పటికి ఒక్క ఉద్యోగి కూడా అధిక పింఛనుకు అర్హత పొందలేదని ఈపీఎఫ్వో సిబ్బంది ఇటీవల కార్మికశాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఈపీఎఫ్వో పెట్టిన కఠిన నిబంధనలపై ఉద్యోగులు, పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుంటే, అధిక వేతనంపై ఈపీఎఫ్ చందాను ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. పేరా 26(6) కింద ఆధారాన్ని సాకుగా పేర్కొని అధిక పింఛనుకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అయితే 2015 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అధిక పింఛనుకు అనుమతించినప్పుడు అధికవేతనంపై 12 శాతం చొప్పున ఈపీఎఫ్ చందాను చెల్లించినప్పుడు ఆ వివరాలు ఈపీఎఫ్ వద్ద అప్డేట్ అయితే ఉద్యోగి నుంచి పేరా 26(6)కింద ఉమ్మడి ఆప్షన్ అడగడానికి వీల్లేదని 2019లో ఈపీఎఫ్వో జారీచేసిన ఆదేశాలను చూపిస్తున్నాయి. దీంతో ఈపీఎఫ్వో పేరా 26(6)పై వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఇలా..
* రూ.15 వేలకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆ మేరకు ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. ఈ ఆప్షన్ను యజమాని ద్వారా సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలకు పంపించాలి. అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్నపుడు, ఆ మేరకు ఈపీఎఫ్ చట్టంలోని నిబంధనల మేరకు పరిపాలన ఛార్జీలు చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు యజమాని ధ్రువీకరణ ఇవ్వాలి.
* ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తును ప్రాంతీయ కార్యాలయాల్లో డిజిటల్ రూపంలో పొందుపరచాలి. సహాయ పీఎఫ్ కమిషనర్ ఆపైస్థాయి అధికారులు ఆ దరఖాస్తును అనుమతించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన వారం రోజుల్లో అధికవేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలి.
* ఈపీఎఫ్ పథకంలో కొత్తగా చేరబోయే సభ్యులు, ఇప్పటికే సభ్యులుగా కొనసాగుతూ భవిష్యత్తులో గరిష్ఠ వేతనపరిమితి దాటి వేతనం పొందుతున్నపుడు ఆ మేరకు చందా చెల్లించదలిచిన సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి.
* ప్రస్తుతం అధికవేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ, గతంలో పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని సభ్యులు, తమ యాజమాన్యాల ద్వారా క్లెయిమ్ల తుది సెటిల్మెంట్ వరకు ఇవ్వవచ్చని తెలిపింది. అయితే క్లెయిమ్ తుదిసెటిల్మెంట్ పదంపై ప్రాంతీయ కార్యాలయాల నుంచి వెలువడిన సందేహాల మేరకు ప్రస్తుతం శుక్రవారం వెలువరించిన సర్క్యులర్ను పోర్టల్ నుంచి తాత్కాలికంగా తొలగించింది.
ఏమిటీ పేరా 26 (6)?
ఈపీఎఫ్వో చట్టం ప్రకారం గరిష్ఠ వేతన పరిమితి 2014 సెప్టెంబరు 1కి ముందు రూ.6500, ఆ తరువాత రూ.15 వేలుగా ఉంది. చట్టంలోని నిబంధనల ప్రకారం గరిష్ఠ వేతన పరిమితికి మించి పొందుతున్న ఉద్యోగులు, ఇస్తున్న యాజమాన్యాలు వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26 (6) కింద ఈపీఎఫ్వో నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. ఉద్యోగి, యజమాని కలిసి అధికవేతనంపై చందా చెల్లించడానికి అంగీకరిస్తున్నామని, ఈ మేరకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామంటూ సహాయ పీఎఫ్ కమిషనర్కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి.
పింఛను లెక్కింపు వేతనం ఖరారు
ఈనాడు, హైదరాబాద్: అధిక పింఛను అర్హత వేతన లెక్కింపు విధానంపై ఈపీఎఫ్వో స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)-95 నిబంధనల మేరకు పింఛను లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఈపీఎఫ్వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ (పింఛన్లు) అప్రజిత జగ్గీ ఆదేశాలు (పింఛను/ఎస్సీ/అధికపింఛను/2022/1357) జారీ చేశారు.
* అధిక పింఛనుకు అర్హత లభిస్తే... 2014 సెప్టెంబరు 1కి కన్నా ముందు నుంచి పింఛను పొందేందుకు అర్హులైన పింఛనుదారులకు పదవీ విరమణ చేసేనాటికి చివరి 12 నెలల వేతన (మూల వేతనం+డీఏ)సగటు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
* 2014 సెప్టెంబరు 1 తరువాత పింఛను పొందేందుకు అర్హత పొందితే.. ఆ ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి చివరి 60 నెలల (అయిదేళ్లు) వేతన (మూల వేతనం+డీఏ) సగటు తీసుకుంటామని వెల్లడించింది.
20 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి...
అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఈపీఎఫ్వో కేంద్ర కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులు సంబంధిత పీఎఫ్ కార్యాలయాల సహాయకుల లాగిన్లోకి వచ్చిన 20 రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించింది. ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులపై జోనల్ కార్యాలయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సకాలంలో డిమాండ్ నోటీసులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?