అధిక పింఛను ఆశావహులకు ఊరట..!
ఈపీఎఫ్వో అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు, పింఛనుదారులు పేరా 26(6)కింద గతంలో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేయకున్నా, తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
పేరా 26(6) ఉమ్మడి ఆప్షన్పై వెనక్కు తగ్గిన ఈపీఎఫ్వో
గతంలో దరఖాస్తు చేయకున్నా తాజాగా ఇచ్చేందుకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్వో అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు, పింఛనుదారులు పేరా 26(6)కింద గతంలో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేయకున్నా, తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఈపీఎఫ్వో జోనల్ కార్యాలయాల అదనపు పీఎఫ్ కమిషనర్లు, ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల్లో ఇచ్చిన వెసులుబాటుపై కొంత స్పష్టత కరవైందని గుర్తించిన కేంద్ర పీఎఫ్ కార్యాలయం ఆవెంటనే సర్క్యులర్ను ఈపీఎఫ్వో పోర్టల్ నుంచి తొలగించింది. త్వరలోనే మరింత స్పష్టత ఇస్తూ ఆదేశాలు ఇస్తామని తెలిపింది.
ప్రస్తుతం ఏం జరుగుతోంది...?
అధికవేతనంపై చందాకోసం 26(6) కింద చాలా మంది ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు. కానీ ఉద్యోగులు, యజమానులూ వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లిస్తూ వచ్చారు. చందా చెల్లించినప్పుడు ఈపీఎఫ్వో అనుమతించింది. ఆ నగదుపై వడ్డీని జమ చేసింది. కానీ అధిక పింఛను దరఖాస్తు సమయంలో పేరా 26 (6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్టు ఆధారాన్ని తప్పనిసరి జతచేయాలని ఆదేశించింది. అధిక పింఛను దరఖాస్తులను పరిష్కరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది పేరా26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఆధారం జతచేయలేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన మొదలైనప్పటి నుంచి ఇప్పటికి ఒక్క ఉద్యోగి కూడా అధిక పింఛనుకు అర్హత పొందలేదని ఈపీఎఫ్వో సిబ్బంది ఇటీవల కార్మికశాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఈపీఎఫ్వో పెట్టిన కఠిన నిబంధనలపై ఉద్యోగులు, పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుంటే, అధిక వేతనంపై ఈపీఎఫ్ చందాను ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. పేరా 26(6) కింద ఆధారాన్ని సాకుగా పేర్కొని అధిక పింఛనుకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అయితే 2015 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అధిక పింఛనుకు అనుమతించినప్పుడు అధికవేతనంపై 12 శాతం చొప్పున ఈపీఎఫ్ చందాను చెల్లించినప్పుడు ఆ వివరాలు ఈపీఎఫ్ వద్ద అప్డేట్ అయితే ఉద్యోగి నుంచి పేరా 26(6)కింద ఉమ్మడి ఆప్షన్ అడగడానికి వీల్లేదని 2019లో ఈపీఎఫ్వో జారీచేసిన ఆదేశాలను చూపిస్తున్నాయి. దీంతో ఈపీఎఫ్వో పేరా 26(6)పై వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఇలా..
* రూ.15 వేలకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆ మేరకు ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. ఈ ఆప్షన్ను యజమాని ద్వారా సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలకు పంపించాలి. అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్నపుడు, ఆ మేరకు ఈపీఎఫ్ చట్టంలోని నిబంధనల మేరకు పరిపాలన ఛార్జీలు చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు యజమాని ధ్రువీకరణ ఇవ్వాలి.
* ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తును ప్రాంతీయ కార్యాలయాల్లో డిజిటల్ రూపంలో పొందుపరచాలి. సహాయ పీఎఫ్ కమిషనర్ ఆపైస్థాయి అధికారులు ఆ దరఖాస్తును అనుమతించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన వారం రోజుల్లో అధికవేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలి.
* ఈపీఎఫ్ పథకంలో కొత్తగా చేరబోయే సభ్యులు, ఇప్పటికే సభ్యులుగా కొనసాగుతూ భవిష్యత్తులో గరిష్ఠ వేతనపరిమితి దాటి వేతనం పొందుతున్నపుడు ఆ మేరకు చందా చెల్లించదలిచిన సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి.
* ప్రస్తుతం అధికవేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ, గతంలో పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని సభ్యులు, తమ యాజమాన్యాల ద్వారా క్లెయిమ్ల తుది సెటిల్మెంట్ వరకు ఇవ్వవచ్చని తెలిపింది. అయితే క్లెయిమ్ తుదిసెటిల్మెంట్ పదంపై ప్రాంతీయ కార్యాలయాల నుంచి వెలువడిన సందేహాల మేరకు ప్రస్తుతం శుక్రవారం వెలువరించిన సర్క్యులర్ను పోర్టల్ నుంచి తాత్కాలికంగా తొలగించింది.
ఏమిటీ పేరా 26 (6)?
ఈపీఎఫ్వో చట్టం ప్రకారం గరిష్ఠ వేతన పరిమితి 2014 సెప్టెంబరు 1కి ముందు రూ.6500, ఆ తరువాత రూ.15 వేలుగా ఉంది. చట్టంలోని నిబంధనల ప్రకారం గరిష్ఠ వేతన పరిమితికి మించి పొందుతున్న ఉద్యోగులు, ఇస్తున్న యాజమాన్యాలు వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26 (6) కింద ఈపీఎఫ్వో నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. ఉద్యోగి, యజమాని కలిసి అధికవేతనంపై చందా చెల్లించడానికి అంగీకరిస్తున్నామని, ఈ మేరకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామంటూ సహాయ పీఎఫ్ కమిషనర్కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి.
పింఛను లెక్కింపు వేతనం ఖరారు
ఈనాడు, హైదరాబాద్: అధిక పింఛను అర్హత వేతన లెక్కింపు విధానంపై ఈపీఎఫ్వో స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)-95 నిబంధనల మేరకు పింఛను లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఈపీఎఫ్వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ (పింఛన్లు) అప్రజిత జగ్గీ ఆదేశాలు (పింఛను/ఎస్సీ/అధికపింఛను/2022/1357) జారీ చేశారు.
* అధిక పింఛనుకు అర్హత లభిస్తే... 2014 సెప్టెంబరు 1కి కన్నా ముందు నుంచి పింఛను పొందేందుకు అర్హులైన పింఛనుదారులకు పదవీ విరమణ చేసేనాటికి చివరి 12 నెలల వేతన (మూల వేతనం+డీఏ)సగటు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
* 2014 సెప్టెంబరు 1 తరువాత పింఛను పొందేందుకు అర్హత పొందితే.. ఆ ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి చివరి 60 నెలల (అయిదేళ్లు) వేతన (మూల వేతనం+డీఏ) సగటు తీసుకుంటామని వెల్లడించింది.
20 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి...
అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఈపీఎఫ్వో కేంద్ర కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులు సంబంధిత పీఎఫ్ కార్యాలయాల సహాయకుల లాగిన్లోకి వచ్చిన 20 రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించింది. ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులపై జోనల్ కార్యాలయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సకాలంలో డిమాండ్ నోటీసులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి వీడలేదు
పోలింగ్ రోజు సమీపిస్తున్నా కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు