ChatGPT: చాట్జీపీటీపై నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేస్తున్న ఓ సీఈఓ!
ChatGPT: తమ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం కోసం జెనీస్ సీఈఓ ఆకాశ్ నిగమ్ చాట్జీపీటీని వినియోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ ఏఐ చాట్బాట్పై అవగాహన పెంచుకోవాలని ఉద్యోగులను సూచించారు. వారందరి కోసం చాట్జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ను తీసుకున్నారు
ఇంటర్నెట్ డెస్క్: చాట్జీపీటీ (ChatGPT) తెరపైకి వచ్చిన తర్వాత కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై ప్రపంచ వ్యాప్తంగా తెగ చర్చ జరుగుతోంది. ఓపెన్ఏఐ అనే సంస్థ సృష్టించిన ఈ చాట్జీపీటీ (ChatGPT) యూజర్లు అడిగే అన్ని ప్రశ్నలకు ఇట్టే సమాధానం ఇస్తోంది. వ్యాసాలు, ప్రసంగాలు రాయడం, క్లిష్టమైన గణిత సమీకరణాలకు జవాబులు చెప్పడం, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కఠినమైన కోడ్లు రాసిపెట్టడం.. ఇలా అన్నింటినీ చకచకా చేసేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో కొన్ని ఉద్యోగాల స్థానంలో ఏఐని వినియోగిస్తారనే వాదన బలపడుతోంది. ఈ క్రమంలో ఓ అంకుర సంస్థ సీఈఓ చాట్జీపీటీ కోసం నెలకు రూ.రెండు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
చాట్జీపీటీ (ChatGPT)ని తమ కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచడం కోసం వినియోగించుకోవాలని అంకుర సంస్థ జెనీస్ సీఈఓ ఆకాశ్ నిగమ్ నిర్ణయించారు. తమ సంస్థలోని ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్, ఫైనాన్స్, డిజైన్, ఆర్అండ్డీ, అకౌంటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో చాట్జీపీటీని ఉపయోగించే విధానాన్ని తెలుసుకోవాలని ఉద్యోగులను సూచించారు. ఈ కంపెనీలో మొత్తం 120 మంది పనిచేస్తున్నారు. వారందరి కోసం చాట్జీపీటీ (ChatGPT) ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని దాని ఖర్చును కంపెనీయే భరిస్తోంది. అందుకోసం నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తోంది.
నిగమ్ సూచన మేరకు ఉద్యోగులు సైతం చాట్జీపీటీ (ChatGPT)ని తమ ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం కోసం సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకు ఆర్అండ్డీ విభాగం.. గణిత, కోడింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఈ చాట్బాట్ను వినియోగించుకుంటుంది. అలాగే లీగల్ డాక్యుమెంట్లు రాయడం, కార్పొరేట్ రెగ్యులేషన్లను రూపొందించడం, ప్రజెంటేషన్లు తయారు చేయడం వంటి పనులను సైతం చాట్జీపీటీ (ChatGPT) ద్వారానే చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ క్రమంలో దీన్ని వినియోగించడంలో కొంత అనుభవం గడించిన సీనియర్లు.. కింది స్థాయి ఉద్యోగులకు తర్ఫీదునిస్తున్నారు.
ఓవైపు పనిప్రదేశంలో ఏఐ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు దీన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలో కొన్ని కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జరిపిన అధ్యయనంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. చాట్జీపీటీ (ChatGPT)ని వినియోగించడం వల్ల పనిప్రదేశంలో ఉత్పాదకత దాదాపు 14 శాతం పెరిగినట్లు గుర్తించింది. అలాగే తక్కువ అనుభవం, నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు పనిని 35 శాతం వేగంగా పూర్తి చేసినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
Dmart Q4 results: దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్మార్ట్స్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి. -
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్ కామత్. స్పామ్ కాల్స్పై ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు