Google: ఫిఫా ఫైనల్ వేళ.. గూగుల్ సరికొత్త రికార్డ్
ఉత్కంఠభరింతంగా సాగిన సాకర్ ప్రపంచకప్ తుది పోరును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ మ్యాచ్ కోసం గూగుల్లో తెగ వెతికేశారట. దీంతో గూగుల్ 25 ఏళ్లలో అత్యధికంగా సెర్చ్ ట్రాఫిక్ను నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ (FIFA World cup 2022)లో ఫ్రాన్స్ (France)ను ఓడించి అర్జెంటీనా (Argentina) జగజ్జేతగా అవతరించింది. ఈ మెగా టోర్నీలో సాకర్ మాంత్రికుడు లియొనెల్ మెస్సీ (Lionel Messi), ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె (Kylian Mbappe) సరికొత్త రికార్డులు సృష్టించారు. అయితే, వీరిద్దరే కాదండోయ్.. సాకర్ తుది సమరం వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) కూడా రికార్డు బద్దలుకొట్టింది. తన 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ను నమోదు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు.
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ పోరుపై సుందర్ పిచాయ్ (Sundar Pichai) ట్విటర్లో స్పందించారు. ‘‘ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సమయంలో గూగుల్ సెర్చ్లో తెగ వెతికేశారు. గత 25 ఏళ్లలో అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ రికార్డ్ ఇదే. యావత్ ప్రపంచం కేవలం ఒకే ఒక్క దాని (Fifa Worldcup) కోసం వెతికినట్లుంది’’ అని ఆయన రాసుకొచ్చారు. ఇక నిన్నటి ఫైనల్ మ్యాచ్.. అత్యుత్తమ ఆటల్లో ఒకటిగా నిలిచిందని కొనియాడారు. మెస్సి (Messi) చాలా గొప్పగా ఆడారని ప్రశంసించారు.
ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్లో మెస్సి అరుదైన ఘనత సాధించాడు. ఓ ప్రపంచ కప్లో గ్రూప్ దశ, ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక, ఫిఫా టోర్నీల్లో ఉత్తమ ఆటగాడిగా రెండు సార్లు బంగారు బంతి అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇక ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె.. ఫైనల్లో ఏకంగా మూడు గోల్స్ చేసి ఆశ్చర్యపర్చాడు. ఇప్పటి వరకు జరిగిన ఫిఫా(FIFA) ప్రపంచకప్లలో.. ఫైనల్ మ్యాచ్లో మూడు గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
ఇదిలా ఉండగా సాకర్ ప్రపంచకప్ ఫైనల్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిఫా, మెస్సి, అర్జెంటీనా, ఎంబాపె పేర్లు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్లో భారత జట్టు లేనప్పటికీ మన దేశంలో ఈ టోర్నీకి వీక్షకాదరణ ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా శోధించిన వాటిల్లో ఫిఫా ప్రపంచకప్ మూడో స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు