Honor 90 5G: 200 ఎంపీ కెమెరా ఫోన్తో హానర్ రీ ఎంట్రీ.. లాంచ్ డేట్ ఫిక్స్
Honor 90 5G Ready to launch in India: హానర్ 90 5జీ హానర్ బ్రాండ్ భారత్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 14న కొత్త ఫోన్ను లాంచ్ చేయనుంది.
Honor 90 5G | ఇంటర్నెట్డెస్క్: హానర్ బ్రాండ్ మళ్లీ భారత్లోకి అడుగుపెట్టబోతోంది. త్వరలో ఓ కొత్త ఫోన్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14న హానర్ 90 5జీ ఫోన్ను (Honor 90 5G) ఆ కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ మేరకు హెచ్టెక్ (HTech) కంపెనీ ఎక్స్ (ట్విటర్) ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 200 ఎంపీ కెమెరాతో వస్తుండడం ఈ ఫోన్ ప్రత్యేకత. హానర్ 90 5జీ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది.
హానర్ 90 5జీ లాంచ్కు సంబంధించి సెప్టెంబర్ 14న ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అమెజాన్లో ఈ ఫోన్ను విక్రయించనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. ఇందులో 1.5K రిజల్యూషన్ కలిగిన టీయూవీఎ రైన్ల్యాండ్ సర్టిఫైడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇది 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్లోనూ డిస్ప్లేనే ప్రధానంగా కంపెనీ హైలైట్ చేస్తోంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత మేజిక్ ఓఎస్ 7.1తో ఈ ఫోన్ వస్తోంది. వెనుక వైపు 200 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు, ముందు వైపు 50 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పెంపు.. కొత్త డెడ్లైన్ ఇదే..!
హానర్ 90 5జీ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలిసింది. ఫోన్ ధర విషయానికొస్తే రూ.35 వేలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, ధర, ఇతర వివరాలు లాంచింగ్ రోజు తెలుస్తాయి. 2020 నుంచి హానర్ బ్రాండ్ ఫోన్లు భారత్లో విక్రయించడం లేదు. ఇటీవల రియల్మీ వైస్ప్రెసిడెంట్ మాధవ్సేత్ రియల్మీకి గుడ్బై చెప్పి హానర్లో చేరారు. ఆయన నేతృత్వంలో హానర్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పదవికి సరైన అభ్యర్థి దొరకలేదని తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పీఈఎస్బీ ఈ నెల 14న హెచ్పీసీఎల్ సీఎండీ కోసం 8 మందిని ఇంటర్య్వూ చేసింది. -
ఎస్బీఐ అనుబంధ సంస్థల నగదీకరణ!
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ వంటి అనుబంధ సంస్థల నగదీకరణ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వెల్లడించారు. అయితే వీటిని నగదీకరించే ముందు వాటి కార్యకలాపాలు, వ్యాపారాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. -
కార్డు లావాదేవీలు తగ్గించేశారు
డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేయడం ద్వారా చెల్లింపునకు వీలున్న పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలను కొత్తగా అమర్చుకునే వారి సంఖ్య బాగా నెమ్మదించింది. అన్ని రకాల చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్న వ్యవస్థీకృత, పెద్ద ఫార్మాట్ రిటైల్ సంస్థలే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. -
సూక్ష్మ రుణాలు 27% పెరిగాయ్
వివిధ ఆర్థిక సంస్థలు ఈ ఏడాది జనవరి-మార్చిలో మంజూరు చేసిన సూక్ష్మ రుణాల మొత్తం, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 27% అధికమైనట్లు క్రెడిట్ సమాచార కంపెనీ క్రిఫ్ హై మార్క్ వెల్లడించింది. ఇదే సమయంలో రుణ ఎగవేతలూ స్వల్పంగా పెరిగాయని తెలిపింది. -
కొత్త హోదాల జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామక కార్యకలాపాల్లో కొత్త హోదాలపైనే ఎక్కువ దృష్టి కనిపించనుంది. వేర్వేరు రంగాల్లోని కంపెనీలు 27% మేర తాజా ఉద్యోగాలను ఇవ్వవచ్చని ఒక నివేదిక అంటోంది. -
ఎస్ఈజెడ్ల ఎగుమతులు రూ.13.5 లక్షల కోట్లు
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజెడ్ల) నుంచి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 163.39 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13.5 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. -
పసిడి దిద్దుబాటు!
పసిడి ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.71,080 దిగువన లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. ఈ స్థాయికి దిగువన చలిస్తే రూ.70,205; రూ.69,659 వరకు దిద్దుబాటు కావచ్చు. -
తక్కువ స్లాబ్ ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలి: సీఐఐ
తక్కువ స్లాబ్లో ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ సంజీవ్ పురి కోరారు. అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని త్వరలో ప్రవేశపెట్టబోయే పూర్తి ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్లో వారికి ఉపశమనం కల్పించాలని సూచించారు. -
బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి అంతర్జాతీయ సంస్థలతో జట్టు
విద్యుత్ వాహనాలకు భవిష్యత్తులో గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, స్థానికంగా బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామని మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ అనిశ్ షా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
జనవరి- మార్చి త్రైమాసికానికి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.431 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2022-23లో ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.458 కోట్లతో పోలిస్తే లాభం 6 శాతం తగ్గింది. పసిడి రుణ వ్యాపారాన్ని నిర్వహించకుండా కంపెనీపై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇందుకు కారణమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
-
దర్శన్పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?
-
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
-
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
-
కమల్ హాసన్ బయోపిక్.. శ్రుతి హాసన్ రియాక్షనిదే
-
ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..