రద్దయిన బీమా పాలసీని ఎలా పునరుద్ధరించాలి?
సాధారణంగా పాలసీలను పునరుద్ధరించాడానికి బీమా సంస్థలు రెండేళ్లు గడువును ఇవ్వాల్సి ఉంటుంది
కాలం చెల్లిన (లాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని పాలసీదార్లకు ఇస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రకటించింది. నేటి (ఆగస్టు 10) నుంచి అక్టోబరు 10 వరకు కాలం చెల్లిన పాలసీలను ఖాతాదారులు పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. టర్మ్ పథకాలు, అధిక నష్టభయం ఉన్న పథకాలు మినహా ఇతరాలకు వైద్య పరమైన మినహాయింపులు ఏమీ ఇవ్వడం లేదని, అయితే ఆలస్య రుసుము విషయంలో ఉంటుందని పేర్కొంది. అర్హత కలిగిన కొన్ని పథకాలను, వాయిదా చెల్లించని తేదీ నుంచి అయిదేళ్లలోపు పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆలస్య రుసుములో 20 శాతం మినహాయింపు ఉంటుందని, ఇదే రూ.1-3 లక్షలలోపు అయితే 25 శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పాలసీ కాలవ్యవధి ముగియని వాటినే పునరుద్ధరించుకునే వీలుందని స్పష్టంచేసింది.
ఎలా పునురుద్ధరించాలి?
నిర్ణీత తేదీన దాటి 30 రోజుల గ్రేస్ వ్యవధిలో ప్రీమియంలు చెల్లించకపోతే బీమా పాలసీ ఆగిపోతుంది. పాలసీ విధానం ఆధారంగా ఇది స్వయంచాలకంగా తగ్గిపోతుంది లేదా పునరుద్ధరణ కోసం ఒకసారి అనుమతిస్తుంది. సాధారణంగా, పాలసీదారులకు వారి పాలసీలను పునరుద్ధరించాడానికి బీమా సంస్థలు రెండేళ్ల వ్యవధిని అందించాల్సి ఉంటుంది. దాదాపు అన్ని జీవిత బీమా కంపెనీలు రద్దయిన పాలసీల పునరుద్ధరణకు రెండు సంవత్సరాల వరకు అనుమతిస్తాయి. దాని కోసం, పాలసీదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీ లేదా జరిమానాతో చెల్లించాలి.
రిస్క్ కవర్లు
టర్మ్ ప్లాన్స్ వంటి రిస్క్ కవర్ల విషయంలో, మీరు గ్రేస్ వ్యవధిలో కూడా ప్రీమియం చెల్లించకపోతే రద్దవుతుంది. మీరు ప్రీమియంలతో పాటు హామీ ప్రయోజనాన్ని కూడా వదిలివేయవలసి ఉంటుంది. టర్మ్ ప్లాన్ల పునరుద్ధరణకు మూడు నెలల్లో పాలసీని ఆరోగ్య డిక్లరేషన్ ఫారంతో చేసుకోవచ్చు, కానీ ఆరు నెలలకు మించితే, వైద్య పరీక్షలను మళ్లీ చేయమని పాలసీదారుడిని కోరతారు. నిర్దిష్ట పాలసీలకు పూచీకత్తు నిబంధనల ఆధారంగా వైద్య పరీక్షల అవసరం కూడా మారవచ్చు.
యులిప్స్
యులిప్స్ విషయంలో, మీరు ప్రీమియం చెల్లించని తేదీ నుంచి రెండేళ్ల వరకు పాలసీని పునరుద్ధరించవచ్చు. మొదటి ఐదేళ్ళలో లేదా లాక్-ఇన్ వ్యవధిలో ప్రీమియం చెల్లించడం మానేస్తే, పాలసీ 90 రోజుల వ్యవధి తర్వాత రద్దయినట్లుగా పరిగణించి, బీమా సంస్థ ఫండ్ విలువను నిలిపివేత నిధికి తరలించి, నిలిపివేత ఛార్జీని విధిస్తుంది (గరిష్టంగా మొదటి సంవత్సరంలో నిలిపివేస్తే, ఇది రూ. 6,000). లాక్-ఇన్ వ్యవధి తర్వాత మీరు ప్రీమియంలు చెల్లించడం మానేస్తే, పాలసీని పునరుద్ధరించడానికి బీమా సంస్థ మీకు ఒకసారి అవకాశం ఇస్తుంది.
సాంప్రదాయ బీమా పాలసీలు
సరెండర్ విలువను పొందడానికి ముందు మీరు ప్రీమియం చెల్లించకపోతే, మీరు చెల్లించిన అన్ని ప్రీమియంలను కోల్పోవచ్చు. పాలసీ చెల్లింపుగా మారితే, అది తగ్గదు, తక్కువ మొత్తంతో హామీ లభిస్తుంది. సాంప్రదాయ పాలసీలు రెండు మూడు వార్షిక ప్రీమియంలు చెల్లించిన తర్వాత సరెండర్ విలువను పొందుతాయి. మీ పాలసీ రద్దు జరిగి రెండు, మూడు సంవత్సరాలు అయితే, మీ బీమా సంస్థ ప్రస్తుతం ఎల్ఐసీ ప్రారంభించిన పునరుద్ధరణం అవకాఅం కల్పిస్తే మాత్రమే మీరు దాన్ని పునరుద్ధరించవచ్చు.
అయితే ఇప్పుడు బీమా సంస్థలు రెండు సంవత్సరాల తరువాత కూడా తమ పాలసీలను పునరుద్ధరించడానికి అనుమతించే పునరుద్ధరణ ప్రచారాలను ప్రారంభిస్తాయి, సంస్థలకు మధ్య భిన్నంగా ఉండే కొన్ని షరతులతో ముందుకు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికైనా మీ రద్దయిన పాలసీలను పునరుద్ధరించుకొని కొనసాగిస్తే ఆర్థిక భరోసా లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434