22 సార్లు కత్తితో పొడిచి..

రెండు గ్రూపుల మధ్య చెలరేగిన గొడవను ఆపేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తితో 22 సార్లు పొడిచి దారుణంగా హత్యచేశారు....

Updated : 13 Dec 2020 04:44 IST

దిల్లీ: రెండు గ్రూపుల మధ్య చెలరేగిన గొడవను ఆపేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తితో 22 సార్లు పొడిచి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కిషన్, రవి అనే వ్యక్తులు సఫ్దార్‌జంగ్‌ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో సెక్యూరిటీగార్డులుగా పనిచేసేవారు. అయితే వారి నిర్లక్ష్య పనితీరు నచ్చని యాజమాన్యం ఇరువురిని విధుల్లోనుంచి తొలగించింది. వారి స్థానంలో ముకేశ్‌, రాకేశ్‌ అనే మరో ఇద్దరిని నియమించింది. దీంతో కొత్తగా చేరినవారిపై కిషన్‌, రవి కక్ష పెంచుకున్నారు. వారిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి విధులు ముగించుకున్న ముకేశ్‌, రాకేశ్‌ మరో మిత్రుడు నీరజ్‌తో కలిసి ఇళ్లకు బయలుదేరారు. వారు మార్గం మధ్యలో ఉండగా కిషన్‌, రవితోపాటు ఓ మైనర్‌ వెళ్లి ఆ ముగ్గురిని అడ్డుకున్నారు. ముకేశ్‌, రాకేశ్‌తో గొడవకు దిగారు. దీంతో కలుగజేసుకున్న నీరజ్‌ గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న కిషన్, రవి.. నీరజ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డారు. 22 సార్లు అతడిని పొడిచి దారుణంగా హత్యచేశారు. ఈ దాడిలో ముకేశ్‌, రాకేశ్‌కు కూడా గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి..

అనుమానిస్తున్నాడని ఊపిరి తీశారు

బిల్లు అడిగారని ఆసుపత్రి సిబ్బందిపై దాడి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని