కొవిడ్ టీకా త్వరగా ఇప్పిస్తామంటూ..
సైబర్ మోసగాళ్లు ఇదే అదనుగా ప్రజల్లో కొవిడ్ పట్ల భయాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు.
వ్యాక్సిన్ అడ్వాన్స్ బుకింగ్ పేరుతో నకిలీ ఫోన్కాల్స్..
భోపాల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్-19 వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. తొలి విడత పంపిణీలో 30 కోట్ల మందికి టీకాను అందచేస్తామని.. వారిలో వైద్యారోగ్య సిబ్బందికి, కరోనా యోధులకు అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. ఐతే సైబర్ మోసగాళ్లు ఇదే అదనుగా ప్రజల్లో కొవిడ్పై భయాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. కొవిడ్ టీకా త్వరగా ఇప్పిస్తామని, అందుకు కొంత మొత్తం చెల్లించి తమ పేరు నమోదు చేయించుకోవాలని ఫోన్లు చేస్తున్నారు. ఈ మాదిరి ఆరు ఫిర్యాదులను నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఓటీపీ నంబర్లు వస్తాయంటూ..
తాము ప్రభుత్వ ఏజంట్లమని, ప్రభుత్వ సంస్థల నుంచి మాట్లాడుతున్నామని మోసగాళ్లు చెపుతున్నారు. వ్యాక్సిన్ తయారీ, సరఫరా వ్యవస్థలలో తాము భాగమని.. కొవిడ్ వ్యాక్సిన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేందుకు తాము తెలిపిన బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేయాల్సిందిగా కోరుతున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కంటే ముందుగానే టీకా ఇప్పించగలమని హామీ ఇస్తున్నారు. ఇందుకు గాను రూ.500 నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వారి మాటలను బాధితులు నమ్మేందుకు డబ్బు సదరు ఖాతాల్లో జమ అయిన తర్వాత వారికి ఓటీపీ నంబర్లు కూడా వస్తాయని నమ్మబలుకుతున్నారు.
భోపాల్ ప్రజలు ఈ కాల్స్పై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ కాలేజీ విద్యార్థి, మరి కొన్ని కుటుంబాలకు ఇటువంటి ఫోన్కాల్స్ వచ్చినట్టు సమాచారం. వారిలో ఇప్పటికే కొవిడ్ సోకిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు భోపాల్ పోలీస్ సైబర్ విభాగంలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విధమైన నకిలీ ఫోన్కాల్స్ అధికంగా జార్ఖండ్, హరియాణా, రాజస్తాన్ ప్రాంతం నుంచి వస్తున్నాయని పోలీసులు అంటున్నారు.
హెచ్చరించిన ఇంటర్పోల్
ఈ సైబర్ కేటుగాళ్ల ఫోన్ కాల్స్ వల్ల తమ పరిధిలో ఇప్పటి వరకు ఎవరూ మోసపోలేదని.. ఐతే, ఈ విధమైన నేరాలు సమీప భవిష్యత్తులో పెరిగే ప్రమాదం ఉందని మధ్యప్రదేశ్ పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా కొవిడ్, ఫ్లూ వ్యాక్సిన్లకు సంబంధించి తప్పుడు సమాచారం, నకిలీ ప్రకటనలు, చట్టవిరుద్ధమైన వాగ్దానాలతో మోసాలు జరిగే అవకాశముందని అంతర్జాతీయ పోలీసు సంస్థ ‘ఇంటర్పోల్’.. తన 194 సభ్యదేశాలకు ఆరెంజ్ నోటీసు జారీచేసి హెచ్చరించటం గమనార్హం.
అంతేకాకుండా ప్రమాదకర స్థితిలో అత్యవసర చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులను ఆదుకునేందుకు.. ఆర్థిక సాయం చేయాలని అందుకుగాను విరాళాలను బ్యాంకు ఖాతాల్లో వేయాలంటూ కోరుతున్న సంఘటనలకు సంబంధించిన కేసులు కూడా తమ వద్ద నమోదయ్యాయని మధ్యప్రదేశ్ పోలీసులు అంటున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం