ఏడుగురిపై అత్యాచారం.. బ్లాక్మెయిలింగ్.. అరెస్ట్
మధ్యప్రదేశ్కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యాపార వేత్త ఏడుగురిపై అత్యాచారం చేసి బ్లాక్మెయిలింగ్కు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆరుగురు మహిళలు...
ఓ యువతి ఫిర్యాదుతో కటకటాలపాలైన వ్యాపారవేత్త
సాత్నా: మధ్యప్రదేశ్కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యాపార వేత్త ఏడుగురిపై అత్యాచారం చేసి బ్లాక్మెయిలింగ్కు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆరుగురు మహిళలు వెనకడుగు వేయగా.. ఓ 16 ఏళ్ల బాధితురాలు మాత్రం ధైర్యం చేయడంతో నిందితుడు కటకటాలపాలైన సంఘటన సాత్నా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ రియాజ్ ఇక్బాల్ కథనం ప్రకారం.. 16 ఏళ్ల యువతిని సమీర్ అనే పేరుతో రెండేళ్ల కిందట సదరు వ్యాపారవేత్త పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించడంతోపాటు.. బ్లాక్మెయిలింగ్కు దిగేవాడు. అయితే నిందితుడి చర్యలతో విసిగిపోయిన బాధితురాలు కొల్గావాన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గత శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు బయటకొచ్చాయి. సమీర్ అలియాస్ అతీక్కు రెండు పేర్లతో పాస్పోర్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బాధిత యువతితో పరిచయం కాకముందు నిందితుడు పలువురు మహిళలను ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేసేవాడని విచారణలో పోలీసులు తేల్చారు. ఓ మహిళను పెళ్లి చేసుకుని ఆమెను వేరే మతంలోకి మార్చేసి, 2017లో ఆమెకు విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా బెదిరింపులకు దిగేవాడు. మహిళలతో కొంతకాలం సంబంధాలు కొనసాగించి ఆ తర్వాత బ్లాక్మెయిలింగ్కు పాల్పడి పెద్ద మొత్తంలో సొమ్మును డిమాండ్ చేసేవాడని గుర్తించినట్లు ఎస్పీ రియాజ్ ఇక్బాల్ తెలిపారు. విచారణ సందర్భంగా తమ బాధలను పోలీసులకు వివరించిన మహిళలు ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయొద్దని వాపోయారు. ఇంకా తమ విచారణలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన పలు నకిలీ లెటర్ హెడ్స్ దొరికాయని చెప్పారు. వీటిని ఉపయోగించి వీఐపీ కోటాలో రైళ్లలో ప్రయాణించేవాడన్నారు. అక్రమంగా సొమ్మును రుణాలుగా ఇచ్చేవాడని వివరించారు. నిందితుడికి సంబంధించి నేరాలను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రియాజ్ ఇక్బాల్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం