Andhra News: జాతరలో అందరూ చూస్తుండగానే.. అల్లుడిని నరికి చంపిన మామ

అల్లుడిని మామ హత్య చేసిన దారుణ ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి.కోటకొండలో బుధవారం జరిగింది.

Published : 08 Mar 2023 22:09 IST

దేవనకొండ: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. దేవనకొండ మండలం పి.కోటకొండలో పట్టపగలే దారుణహత్య జరిగింది. గ్రామంలో జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అయినా, అందరూ చూస్తుండగానే అల్లుడు సూర్యప్రకాశ్‌(23)ను మామ లింగమయ్య కత్తులతో దాడి చేసి హతమార్చాడు. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో జాతరలో పాల్గొన్న అల్లుడిని హత్య చేయాలని లింగమయ్య భావించాడు. పథకం ప్రకారం కత్తులు సిద్ధం చేసుకుని దాడి చేశాడు. ఘటనా స్థలంలోనే కుప్పకూలిన సూర్యప్రకాశ్‌ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని