Prakasam: పోలీసులు కొట్టారని ఆత్మహత్యకు యత్నించిన దళిత యువకుడు మృతి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన యువకుడు మోజెస్‌ మృతి చెందాడు.

Published : 12 Dec 2023 09:10 IST

యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలీసులు కొట్టారనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన దళిత యువకుడు మోజెస్‌ మృతి చెందాడు. ఈనెల 6న (బుధవారం) పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని అతడు నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన మోజెస్‌కు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మోజెస్‌ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని