Crime news: బాలికపై గ్యాంగ్రేప్, హత్య.. గోనె సంచిలో మృతదేహం
తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండాపోయిన 14 ఏళ్ల బాలిక శవమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మైనర్ మృతదేహాన్ని.......
దిల్లీ: తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండాపోయిన 14 ఏళ్ల బాలిక శవమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మైనర్ మృతదేహాన్ని ఔటర్ దిల్లీలోని నరేలా ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గోనె సంచిలో శవాన్ని కుక్కి ఓ దుకాణం సమీపంలో పడేశారని తెలిపారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. సదరు వ్యక్తి స్థానికంగా ఓ దుకాణంలో పనిచేసేవాడని.. దిల్లీ నుంచి ముంబయికి పారిపోతుండగా సన్నోత్ గ్రామంలో అతడిని పట్టుకున్నట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
డీసీపీ వివరాల ప్రకారం.. నరేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఫిబ్రవరి 12 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించిన తల్లిదండ్రులు ఆచూకీ లభించకపోవడంతో మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ శనివారం నరేలాలోని ఓ దుకాణ యజమాని నుంచి పోలీసులకు ఫోన్ వెళ్లింది. తన షాప్ సమీపంలో తీవ్ర దుర్గంధం వెలువడుతోందని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. ఓ గోనె సంచిలో పాక్షికంగా కుళ్లిన శవం బయటపడింది. కాగా అది కిడ్నాప్కు గురైన బాలికదేనని నిర్ధరించారు.
తన దుకాణంలో పనిచేసే వ్యక్తి మూడు రోజులుగా కనిపించడం లేదని ఫోన్ చేసిన వ్యక్తి సమాచారం ఆధారంగా టెక్నికల్ సర్వైలెన్స్తో ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితుడితో కలిసి మద్యం సేవించి తర్వాత.. బాలికకు నిందితుడు ఫోన్ చేశాడు. ఏదో పనిఉందని పిలిపించాడు. అతడి మాటలు నమ్మివచ్చిన బాలికను కిడ్నాప్ చేసి.. నిందితులిద్దరు ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ధరించిన ప్యాంటుతోనే ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.