corona vaccine: హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్ల చోరీ

హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్ల చోరీ జరిగింది. నగరంలోని జాంబాగ్ యూపీహెచ్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 17 కొవాగ్జిన్‌, 27 కొవిషీల్డ్‌ వయల్స్‌ను చోరీ చేశారు.

Published : 11 Jan 2022 01:09 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్ల చోరీ జరిగింది. నగరంలోని జాంబాగ్ యూపీహెచ్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 17 కొవాగ్జిన్‌, 27 కొవిషీల్డ్‌ వయల్స్‌ను చోరీ చేశారు. అంతేకాదు, మూడు కంప్యూటర్లను కూడా ఎత్తుకెళ్లారు. చోరీ గురైన వయల్స్‌తో 340 కొవిషీల్డ్‌ డోసులు, 270 కొవాగ్జిన్‌ డోసులు ఇవ్వవచ్చు. చోరీ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణలో కొత్తగా 1800 కరోనా కేసులు

తెలంగాణలో కొవిడ్‌-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం 70,679 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1,825మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కరోనాతో బాధపడుతూ ఒకరు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,043 చేరింది. గడిచిన 24 గంటల్లో 351మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.58శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.26శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని