corona vaccine: హైదరాబాద్లో కరోనా వ్యాక్సిన్ల చోరీ
హైదరాబాద్లో కరోనా వ్యాక్సిన్ల చోరీ జరిగింది. నగరంలోని జాంబాగ్ యూపీహెచ్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 17 కొవాగ్జిన్, 27 కొవిషీల్డ్ వయల్స్ను చోరీ చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్లో కరోనా వ్యాక్సిన్ల చోరీ జరిగింది. నగరంలోని జాంబాగ్ యూపీహెచ్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 17 కొవాగ్జిన్, 27 కొవిషీల్డ్ వయల్స్ను చోరీ చేశారు. అంతేకాదు, మూడు కంప్యూటర్లను కూడా ఎత్తుకెళ్లారు. చోరీ గురైన వయల్స్తో 340 కొవిషీల్డ్ డోసులు, 270 కొవాగ్జిన్ డోసులు ఇవ్వవచ్చు. చోరీ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది మీర్చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో కొత్తగా 1800 కరోనా కేసులు
తెలంగాణలో కొవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం 70,679 శాంపిల్స్ను పరీక్షించగా, 1,825మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. కరోనాతో బాధపడుతూ ఒకరు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,043 చేరింది. గడిచిన 24 గంటల్లో 351మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.58శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.26శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
కేరళలో ఏనుగు దాడి.. కెమెరామన్ దుర్మరణం
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును