Crime News: విషాదం.. కుమార్తె బర్త్‌డేకు వెళ్లొస్తూ దంపతుల దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై రాణె ఫ్యాక్టరీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో

Updated : 28 Apr 2022 11:21 IST

గజ్వేల్‌ రూరల్‌: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై రాణె ఫ్యాక్టరీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. గజ్వేల్‌ సీఐ వీర ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్‌ పట్టణానికి చెందిన జగ్గయ్యగారి శ్రీధర్‌ (42), జలజ (40) దంపతులు బుధవారం సాయంత్రం తమ కిరాణా దుకాణాన్ని మూసేసి హైదరాబాద్‌లో చదువుకుంటున్న తమ కుమార్తె వద్దకు వెళ్లారు.

హాస్టల్‌లో కుమార్తె జన్మదిన వేడుకలను పూర్తిచేసుకుని తిరిగి గజ్వేల్‌కు వస్తుండగా ప్రజ్ఞాపూర్‌ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో వాహనం పల్టీ కొట్టి కుడివైపునకు పడిపోయింది. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు వస్తున్న మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని