Alert: అది మోసం.. అలాంటి మెసేజ్‌లకు స్పందించకండి!

సైబర్‌ కేటుగాళ్లు తమ దోపిడీని కొత్త రూపాల్లో కొనసాగిస్తున్నారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జేబుల్ని ఖాళీచేసే ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో ‘డేటా ఎంట్రీ ఉద్యోగం’ పేరుతో...........

Published : 20 Oct 2021 01:02 IST

హైదరాబాద్‌: సైబర్‌ కేటుగాళ్లు తమ దోపిడీని కొత్త రూపాల్లో కొనసాగిస్తున్నారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జేబుల్ని ఖాళీచేసే ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో ‘డేటా ఎంట్రీ ఉద్యోగం’ పేరుతో సైబర్‌ మోసగాళ్లు నిరుద్యోగ యువతకు వల విసురుతున్నారని పోలీసులు హెచ్చరించారు. అదంతా మోసమని, వాటిని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ‘‘ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరిట వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి. ముందుగా మీ నుంచి అగ్రిమెంట్‌ తీసుకుంటారు. ఆ తర్వాత మీరు ఆ ఉద్యోగం సరిగా చేయడంలేదని మీపైనే కేసు పెడతామని బెదిరింపులకు గురిచేస్తారు. అంతేకాకుండా అబద్ధపు కోర్టు నోటీసును పంపించి డబ్బులు డిమాండ్‌ చేస్తారు.. జాగ్రత్త!’’ అంటూ సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ట్విటర్‌లో హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని