పేడ దిబ్బలో మహిళ అస్తిపంజరం
నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ.. పేడ దిబ్బలో అస్తిపంజరంమై తేలింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని నారాయణపురం పంచాయతీ విశాలక్షి నగర్లో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామీణ సీఐ ఎంఆర్
శ్రీకాళహస్తి గ్రామీణం: నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ.. పేడ దిబ్బలో అస్తిపంజరంమై తేలింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని నారాయణపురం పంచాయతీ విశాలక్షి నగర్లో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామీణ సీఐ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాలక్షి నగర్కు చెందిన ఉష.. ఖమ్మంకు చెందిన నాగరాజు అలియాస్ నిరంజన్ను ప్రేమ విహహం చేసుకుంది. తల్లి అమ్ములుతో కలిసి ఉష దంపతులు నివసిస్తున్నారు. వీరు విశాలక్ష్మినగర్లో కొద్ది రోజుల క్రితం ఇల్లు కట్టుకున్నారు. దీని నిమిత్తం రూ.5 లక్షల అప్పు చేశారు. ఉషా శ్రీసిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పని చేస్తుండగా, నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో పని చేయకుండా ఉంటే అప్పులు ఎలా తీరుతాయని నాగరాజును అత్త అమ్ములు పలుసార్లు మందలించింది. ఇదే సమయంలో గతేడాది డిసెంబర్లో అమ్ములు కనిపించకుండా పోయింది. తల్లి అదృశ్యంపై ఉషా ఆందోళన వ్యక్తం చేయగా, భర్త నాగరాజు మాత్రం బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని వారించాడు. నెల రోజులు గడిచినా తల్లి ఆచూకీ లభించకపోవడంతో జనవరి 9న శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులకు ఉషా ఫిర్యాదు చేసింది. అదే రోజు తన స్వస్థలంలో పని ఉందంటూ ఖమ్మం వెళ్లిన నాగరాజు ఇప్పటి వరకు తిరిగి రాలేదు.
ఉష ఇంటి ఆవరణలో ఉన్న పేడ దిబ్బను తొలిగించాలని గత కొద్ది రోజులుగా పక్కింటి వారు గొడవ చేస్తున్నారు. దీంతో ఉష ఆదివారం పేడ దిబ్బను వేరే చోటుకు తరలించే క్రమంలో అందులో మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. దీనిపై ఉష పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కృష్ణమోహన్, ఎస్సై వెంకటేశ్, తహసీల్దార్ ఉదయసంతోష్ ఘటనాస్థలికి చేరుకొని అస్తిపంజరం వెలికితీయించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆర్సీఎం రెడ్డి, విజయలక్ష్మి శవ పంచనామా నిర్వహించారు. అమ్ములు చీర, నాగరాజు లుంగిని పేడ దిబ్బలో గుర్తించారు. దీంతో చనిపోయింది అమ్ములుగా పోలీసులు గుర్తించారు. అమ్ములు మృతికి కారణం అల్లుడు నాగరాజు అని అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు