ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన తనయుడు
ఆస్తి కోసం ఓ వ్యక్తి తన తండ్రినే కడతేర్చాడు. ఉరి వేసి కొన ఊపిరితో ఉండగా పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. గ్రామస్థుల అనుమానం మేరకు పోలీసులు హతుడి కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకొన్నాడు.
- ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
చేవెళ్ల : ఆస్తి కోసం ఓ వ్యక్తి తన తండ్రినే కడతేర్చాడు. ఉరి వేసి కొన ఊపిరితో ఉండగా పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. గ్రామస్థుల అనుమానం మేరకు పోలీసులు హతుడి కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకొన్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో రైతు హత్య కేసును ఛేదించినట్లు ఏసీపీ రవీందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఎస్సై రేణుకారెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
తండ్రి బతికి ఉంటే..
ఎన్కెపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి బుచ్చిరెడ్డి (55)కి విక్రంరెడ్డి, శ్రీకాంత్రెడ్డి కొడుకులు. బుచ్చిరెడ్డి తండ్రి చిన్న నారాయణరెడ్డి తమకున్న ఆస్తిలో మూడెకరాలను అదే గ్రామానికి చెందిన వారికి కొన్నేళ్ల క్రితం దానమిచ్చాడు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డి కొడుకులు ఆ భూమి తమకే చెందుతుందని కోర్టులో కేసు వేశారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో రెండేళ్లుగా తండ్రిని సరిగ్గా చూసుకోవడం లేదు. తన తండ్రి భూమి సాగు చేసుకుంటున్న వారి దగ్గర డబ్బులు తీసుకుని రాజీ అవడానికి యత్నిస్తున్నాడని పెద్ద కొడుకు విక్రంరెడ్డికి అనుమానం వచ్చింది. తండ్రి బతికి ఉంటే ఆస్తి తమకు రాదని అంతం చేయాలని నిర్ణయానికి వచ్చాడు.
ఇద్దరి సహకారంతో హత్య..
తన తోడల్లుడైన వికారాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన దామోదర్రెడ్డి, మామ నారాయణరెడ్డికి చెప్పి వారి సాయం కోరాడు. డిసెంబరు 27న వికారాబాద్ కోర్టులో కేసు విచారణ కోసం హాజరయ్యేందుకు బుచ్చిరెడ్డి రాగా పథకం ప్రకారం దామోదర్రెడ్డి అతన్ని మద్యం తాగుదామని తన పొలం (తరిగోపుల గ్రామం) వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న విక్రంరెడ్డి.. తన తండ్రి మద్యం తాగి మత్తులోకి జారుకోగానే వెనుక నుంచి వచ్చి టవల్తో మెడకు చుట్టి ఆత్మహత్యగా చిత్రీకరించాలని పురుగుల మందు తాగించి హత్య చేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గోధుమగూడకు చెందిన నవీన్రెడ్డిని రప్పించి టవేరా వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామమైన ఎన్కెపల్లికి తరలించారు.
విక్రంరెడ్డిని ప్రశ్నించగా..
దాయాదులైన గుండ్ల నర్సింహులు పొలం వద్ద మృతదేహాన్ని పడవేసి ఏమీ తెలియనట్లు ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్లిన వారు మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలపగా వారు వచ్చి మృతుడి నోరు, ముక్కు నుంచి రక్తం కారినట్లు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో తాను చేసిన నేరాన్ని కుమారుడు ఒప్పుకోవడంతో సహకరించిన ముగ్గురిని కూడా పోలీసులు రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం