బాలికపై సామూహిక అత్యాచారం

బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన బాలుడు మరో ఇద్దరు యువకులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హరియాణా రాష్ట్రం జింద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

Published : 26 Apr 2020 00:58 IST

ఇద్దరు యువకులతో కలిసి బాలుడి ఘాతుకం

చండీగఢ్‌: బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన బాలుడు మరో ఇద్దరు యువకులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హరియాణా రాష్ట్రం జింద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలో నివసించే 14 ఏళ్ల బాలికకు స్థానికంగా ఉండే 16 సంవత్సరాల బాలుడికి పరిచయం ఉంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో బాలిక అమ్మమ్మ మాత్రమే ఉందని తెలుసుకున్న బాలుడు ఆమె వద్దకు వెళ్లాడు. ఏవో మాయమాటలు చెప్పి ఆమెను స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు తీసుకెళ్లాడు. కాగా అప్పటికే అక్కడ మాటువేసిన బాలుడి ఇద్దరు స్నేహితులు బాలికను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించి వదిలేశారు. ఇంటికెళ్లిన సదరు బాలిక విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడైన బాలుడిని అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని