Crime News: పోలీసును కిడ్నాప్ చేసిన దొంగ
ఉత్తర్ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఓ వ్యక్తి దుస్సాహసం చేశాడు. కారు పత్రాలు చూపించాలని, ఆపిన ఓ ట్రాఫిక్ పోలీసునే అపహరించాడు...
ఉత్తర్ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఓ వ్యక్తి దుస్సాహసం చేశాడు. కారు పత్రాలు చూపించాలని, ఆపిన ఓ ట్రాఫిక్ పోలీసునే అపహరించాడు. కారులో కానిస్టేబుల్ను తీసుకెళ్లి పది కిలోమీటర్ల దూరంలో వదిలేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.గ్రేటర్ నొయిడా పరిధిలోని ఘోది బచేదా గ్రామానికి చెందిన సచిన్ రావల్.. హరియాణాలోని గురుగ్రామ్లో ఓ కారు షోరూం నుంచి మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును రెండేళ్ల క్రితం దొంగిలించాడు. తన గ్రామానికే చెందిన మరో వ్యక్తి కారు నంబర్తో నకిలీ నంబర్ ప్లేట్ చేయించి రావల్ ఆ కారును నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం.. సూరజ్పుర్లో ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. అక్కడ రావల్ కారును పోలీసులు ఆపారు. కారు పత్రాలు చూపించాలని కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ అడిగాడు. తన మొబైల్ ఫోన్లో వాటి సాఫ్ట్ కాపీస్ ఉన్నాయని రావల్ చెప్పాడు. వాటిని చూసేందుకు కారులోకి ఎక్కాలని కానిస్టేబుల్ను కోరాడు. కారులోకి ఎక్కిన వెంటనే.. కారు డోర్లు లాక్ చేసి, అతడు దూసుకెళ్లాడు. అజయాబ్పుర్ పోలీస్ చౌకి ప్రాంతంలో వీరేంద్ర సింగ్ను దింపేసి పరారయ్యాడు. సోమవారం నిందితుడ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు