అప్పు చెల్లించడానికి దొంగగా మారాడు
కుటుంబ అవసరాల నిమిత్తం ఓ యువకుడు.. రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. చేసిన అప్పు తిరిగి చెల్లించేందుకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఖరీదైన ద్విచక్రవాహనాలు, ల్యాప్టాప్లు, చరవాణులను చోరీ చేస్తూ విజయవాడ పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశాడు.
బోరెల్లి శేఖర్
సూర్యారావుపేట, న్యూస్టుడే : కుటుంబ అవసరాల నిమిత్తం ఓ యువకుడు.. రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. చేసిన అప్పు తిరిగి చెల్లించేందుకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఖరీదైన ద్విచక్రవాహనాలు, ల్యాప్టాప్లు, చరవాణులను చోరీ చేస్తూ విజయవాడ పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశాడు. ఇలా వరుస నేరాలకు పాల్పడుతున్న యుకుడిని సూర్యారావుపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 2 ట్యాప్టాప్లు, 3 చరవాణులు, 6 ద్విచక్రవాహనాలు, రూ.30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామానికి చెందిన బోరెల్లి శేఖర్ (34) బి.టెక్. చదువుకున్నాడు. 2010లో వివాహమైంది. ఒక బాబు, ఇద్దరు అమ్మాయిలు. భార్యతో గొడవ కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. పులివెందులలో చరవాణుల మరమ్మతుల దుకాణంలో పనిచేశాడు. 2016 నుంచి 2019 వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలో పని చేశాడు. హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చి నారాయణపేటలో అద్దెకు ఉన్నాడు. 2020లో కుటుంబ అవసరాల నిమిత్తం అమలాపురంలో ఓ వ్యక్తి వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. అది ఇప్పుడు రూ.4లక్షలు అయ్యింది. దీన్ని తీర్చేందుకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా సూర్యారావుపేట పోలీస్స్టేషన్ పరిధిలో పలు నేరాలు పాల్పడ్డాడు. ఇతడిపై నిఘా ఉంచిన పోలీసులు.. శనివారం ఉదయం గవర్నర్పేట ఎన్టీఆర్ కాంప్లెక్సు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేశారు. చోరీ చేసిన వాహనాలు, సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం