అప్పుడు రీల్స్ కుర్రోడు.. ఇప్పుడు ప్రయాణికుడు
హనుమకొండ జిల్లా వడ్డెపల్లి చెరువు కట్టమీద అక్షయ్ అనే యువకుడు రైలు ముందు రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన రైల్వే ట్రాక్మెన్లు రాజు, తిరుపతి, సురేష్ గుర్తించి అతన్ని సకాలంలో ఆసుపత్రిలో చేర్చారు.
ఇద్దరి ప్రాణాలు కాపాడిన రైల్వే ట్రాక్మెన్లు
కాజీపేట, న్యూస్టుడే
* గత నెల 4వ తేదీ.. హనుమకొండ జిల్లా వడ్డెపల్లి చెరువు కట్టమీద అక్షయ్ అనే యువకుడు రైలు ముందు రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన రైల్వే ట్రాక్మెన్లు రాజు, తిరుపతి, సురేష్ గుర్తించి అతన్ని సకాలంలో ఆసుపత్రిలో చేర్చారు.
* ఈ నెల 4వ తేదీ.. సరిగ్గా నెల. అదే వడ్డెపల్లి చెరువు కట్ట.. రైలు పట్టాలమీద తీవ్రగాయాలతో గంటన్నరపాటు పడి ఉన్న ప్రయాణికుడు శాంతిరాంను ఆ ముగ్గురే గుర్తించారు. మరికొందరి సహకారంతో సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు.
జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్కు చెందిన శాంతిరాం(24) లక్నో ఎక్స్ప్రెస్లో కాచిగూడ నుంచి నాగపూర్కు ప్రయాణం చేస్తున్నారు. రైలులో జనం కిక్కిరిసి ఉండటంతో తలుపు వద్ద కూర్చొని ప్రమాదవశాత్తు వడ్డెపల్లి చెరువు వద్ద ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్యలో జారిపడ్డారు. ఆ సమయంలో శాంతిరాంను ఎవరూ గుర్తించలేదు. ఉదయం 6.15 గంటలకు కీమెన్ రాజు రైలు పట్టాలను పరిశీలిస్తూ వెళ్తుండగా రైలుపట్టాల కంకరమీద అపస్మారక స్థితిలో పడి ఉన్న శాంతరాంను గమనించారు. అక్కడే విధుల్లో ఉన్న గ్యాంగ్మెన్లు తిరుపతి, సురేష్, పి.రాజు, ప్రవీణ్లకు సమాచారం ఇవ్వడంతో వారు అంబులెన్సుకు ఫోన్ చేసి అతన్ని ఆసుపత్రికి పంపారు. శాంతిరాం కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం